వెంకీ మామ ఫ్యాన్స్ కి మళ్ళీ చేదు వార్తే ఇది.!

అసలు టాలీవుడ్ లో ఉన్న అందరి జెనరేషన్ హీరోస్ లో నెగిటివ్ మార్క్ కానీ నెగిటివ్ ఫ్యాన్స్ కానీ లేని హీరోలు ఇద్దరే ఇద్దరు వారు ఒకరు విక్టరీ వెంకటేష్ (వెంకీ) కాగా మరొకరు మెన్స్ మహారాజ్ రవితేజ. అయితే ఈ ఇద్దరూ కూడా ఇప్పుడు తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా వెంకీ మామ హీరోగా నటించిన లాస్ట్ చిత్రం “నారప్ప” అమెజాన్ ప్రైమ్ లో వచ్చి భారీ హిట్ గా నిలిచింది.

కానీ వెంకీ మామ అభిమానుల్లో మాత్రం కాస్త నిరాశనే మిగిల్చింది. అంతే మంచి సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చెయ్యలేదని వారు కాస్త గట్టిగానే ఆందోళన చేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ వారికి చేదు వార్తే అని తెలుస్తుంది. వెంకటేష్ నటించిన మరో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రం ‘దృశ్యం 2’ కూడా ఓటిటి రిలీజ్ లోనే రానుందట. ఓ ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థతో ఆల్రెడీ అన్ని మాటలు జరిగిపోయినట్టు తెలుస్తుంది.

ఇంతకు ముందు అయితే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఉన్నారని తెలిసింది. మరి అందులోనే ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అన్నది చూడాలి. కానీ సినిమా రిలీజ్ మాత్రం డైరెక్ట్ డిజిటల్ గానే అని మాత్రం కన్ఫర్మ్ అయ్యింది. ఇక దీనిపై కూడా అధికారిక క్లారిటీ వస్తే వెంకీ మామ ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.