Nagarjuna: జగన్ తో భేటీ అనంతరం చిరంజీవితో మాట్లాడాను.. జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన నాగార్జున!

Nagarjuna: సంక్రాంతి పండుగ సందర్భంగా నాగార్జున నాగచైతన్య ప్రధాన పాత్రలలో నటించిన బంగార్రాజు చిత్రం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా సక్సెస్ మీట్ ను రాజమండ్రిలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాగార్జున మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా నాగార్జున మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన విషయం గురించి మాట్లాడారు.

జగన్మోహన్ రెడ్డి చిరంజీవి గారికి అపాయింట్మెంట్ ఇచ్చిన విషయాన్ని వారం క్రితమే చిరంజీవి నా దగ్గర ప్రస్తావించారని,వెళ్లి సినీ ఇండస్ట్రీలో ఉన్న సమస్యలు తెలియజేయమని చిరంజీవికి తాను కూడా చెప్పినట్లు నాగార్జున తెలిపారు. ఇక ముఖ్యమంత్రితో భేటీ అనంతరం చిరంజీవి గారితో మాట్లాడానని, సినీ ఇండస్ట్రీపై జగన్ సానుకూలంగా స్పందించారని ఇకపై ఇండస్ట్రీకి అన్ని మంచి రోజులు వస్తాయని నాగార్జున ఈ సందర్భంగా తెలియజేశారు.

టికెట్ల రేట్ల విషయంపై ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో గురించి మరోసారి పునరాలోచించాలని చిరంజీవితో ముఖ్యమంత్రి చెప్పినట్లు తెలిపారు. చిరంజీవి జగన్ తో సమావేశం కావడానికి నన్ను కూడా ఆహ్వానించారు అయితే అప్పుడు ఈ సినిమా విడుదల పనులలో బిజీగా ఉండటం వల్ల వెళ్లలేకపోయాను ఇలా జగన్ సినీ పరిశ్రమ పై అనుకూలంగా స్పందించడంతో నాగార్జున జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలా వీరిద్దరి భేటీ అనంతరం త్వరలోనే ఇండస్ట్రీ సమస్య పరిష్కారం అవుతుందని నాగార్జున ఆశాభావం వ్యక్తం చేశారు.