Radhe Shyam : “బాహుబలి” తర్వాత ప్రభాస్ “రాధే శ్యామ్” రిలీజ్ కి భారీ స్థాయి ప్లానింగ్ అట.!

Radhe Shyam : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డస్కీ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ సినిమా “రాధే శ్యామ్” కోసం అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా వైడ్ భారీ స్థాయి అంచనాలు నెలకొల్పుకున్నా చిత్రాల్లో ఇది కూడా ఒకటి. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ డేట్ తెచ్చుకొని ఫిక్స్ కాగా మళ్ళీ చిత్ర బృందం ఆ రిలీజ్ కతగ్గట్టుగా ప్లానింగ్ లు ఆల్రెడీ స్టార్ట్ చేశారు.

మరి ఇప్పుడు వినిపిస్తున్న లేటెస్ట్ అండ్ క్రేజీ బజ్ అయితే ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొల్పుతుంది. తాజాగా ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని వేల థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారో ఇప్పుడు తెలుస్తుంది. ఈ సినిమాని ఏకంగా అయితే 10, 000 పై చిలుకు థియేటర్స్ లో రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేశారట.

ఇది ప్రభాస్ కి “బాహుబలి 2” తర్వాత ఇంకో అతి పెద్ద రిలీజ్ అన్నట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటికి 7 భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది అని టాక్ ఉంది. ఇక ఈ లెక్కలు అన్నీ తేలాలి అంటే వచ్చే మార్చ్ 11 వరకు ఆగాల్సిందే. ఈ సినిమాని జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహించగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు.