Adavallu Meeku Joharlu: ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా నుంచి సాంగ్ రిలీజ్.. మామూలుగా లేదుగా..?

Adavallu Meeku Joharlu: దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందన, హీరో శర్వానంద్ జంటగా నటించిన తాజా చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ సినిమాను మార్చి 4వ తేదీ విడుదల చేయనున్న విషయం అందరికీ తెలిసిందే. విడుదల తేది దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా నిర్వహించారు చిత్రబృందం.

YouTube video player

ఈ సినిమాలో ఎమోషన్స్ తక్కువ.. కామెడీ ఎక్కువగా ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి ఓ మై ఆధ్య అంటూ ఒక పాటను రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ పాటను బీచ్ లో చిత్రీకరించారు. ఈ పాటకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. తిరుపతి ఈ సినిమాలో సీనియర్ నటీమణులు అయిన రాధిక, ఊర్వశి, ఖుష్బూ లు ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.