Railway Track: రైల్వే ట్రాక్ పై యువతి.. క్షణాల్లో చోటుచేసుకున్న భయంకర ఘటన.. ఏం జరిగిందంటే?

Railway Track: చిత్తూరు జిల్లాలోని రేణిగుంటలో ఒక భయంకరమైన సంఘటన చోటు చేసుకుంది. తిరుపతిలోని ఒక ప్రైవేటు డిగ్రీ కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న ఒక యువతి నిన్న సాయంత్రం నుంచి కనిపించకుండా పోవడంతో ఆమె తల్లిదండ్రులు ఆమె కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. ఇలా ఆ యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఆ తల్లిదండ్రులు సరాసరి పోలీస్ స్టేషన్ కి వెళ్లి సదరు యువతి కనపడటం లేదని కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువతి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలోనే ఆ యువతి సెల్ ఫోన్ నెంబర్ సిగ్నల్స్ ఆధారంగా ఆమె సెల్ ఫోన్ సిగ్నల్ కృష్ణా పురం రైల్వే గేట్ వద్ద చూపించడంతో వెంటనే పోలీసులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు రైలు పట్టాలపై గాలింపు చర్యలు చేపట్టగా పట్టాలపై ఆ యువతి కనిపించింది.అయితే అదే సమయంలో రైలు రావడంతో క్షణాల్లో రైలు ఆ యువతి పైకి వెళ్లడంతో ఒక్కసారిగా ఆమె మృతదేహం చెల్లాచెదురుగా పడిపోయింది.

అయితే రైల్వే ట్రాక్ పైకి యువతి ఎందుకు వచ్చింది. తనే కావాలని సూసైడ్ చేసుకుందా? ఇంట్లో ఏవైనా ఘర్షణలు ఉన్నాయా అనే కోణంలో పోలీసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇలా కళ్ళు ఎదురుగానే ఆ యువతి మృతదేహం చెల్లాచెదురు కావడం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.