Nellore: యువతి ప్రేమించలేదని ఏకంగా అంతటి దారుణానికి ఒడిగట్టిన యువకుడు..?

Nellore: ఇప్పుడున్న జనరేషన్ యువత ప్రేమ అన్న రెండు అక్షరాల మోజులో పడి వారి జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ప్రేమ అన్న ఊబిలో కూరుకుపోయి వారి నూరేళ్ల జీవితాన్ని వారి చేతులతోనే చిదిమేసుకుంటున్నారు. వారి తల్లిదండ్రులకు తీరని దుఃఖం నిలుస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి తనకు దక్కలేదని, ప్రేమకు తల్లిదండ్రులు ఒప్పుకోలేదని, ప్రేమించిన యువతి దూరమైందని ఇలా చిన్నచిన్న కారణాలకే పెద్ద నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రులకు బోలెడు దుఃఖాన్ని మిగులుస్తున్నారు. అంతేకాకుండా ప్రేమించిన యువతి తన ప్రేమను అంగీకరించలేదని చంపడం, లేదా చావడానికైనా వెనుకాడడం లేదు.

అయితే తాజాగా నెల్లూరు జిల్లాలో కూడా ఇలాంటి దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని కాలేజీ మిట్ట కు చెందిన ఒక 17 ఏళ్ల యువతి ఇంటర్ చదువుతోంది. ఇక అదే ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్ చెంచు కృష్ణ అనే వ్యక్తి ప్రేమ పేరుతో ఆ యువతిని పదేపదే వేధిస్తూ ఉండేవాడు. ఇక ఆ విషయం తెలుసుకున్న ఆ యువతి కుటుంబ సభ్యులు ఆ యువకుడిని మందలించారు. దీనితో ఆ యువతిపై కోపం పెంచుకున్న ఆ యువకుడు ఎలా అయినా సరే పగ తీర్చుకోవాలి అని అనుకున్నాడు.

ఈ క్రమంలోనే కాగా ఆ ఇంట్లో నిద్రిస్తున్న ఈ సమయంలో ఎవరూ ఇంట్లో లేకపోవడంతో ఇదే అదునుగా భావించిన ఆ యువకుడు ఇంట్లోకి చొరబడి కత్తితో గొంతు కోశాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లి కళ్ళు తాగి తన ఇంటికి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. గాయాలపాలైన యువతిని గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇక ఆ దారుణానికి ఒడిగట్టింది చెంచుక్రిష్ణ నే అని తెలుసుకున్నారు. వెంటనే అతడిని పోలీసులకు అప్పగించారు. గాయపడిన ఆ యువతిని ఆస్పత్రికి ఇంతగా మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కోటిరెడ్డి తెలిపారు. విషయం తెలుసుకున్న ఆ యువతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సదరు నిందితుడిని కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేస్తున్నారు.