Crime News: మహిళలపై అఘాయిత్యానికి పాల్పడ్డ యువకుడు.. లైంగిక వాంఛ తీర్చలేదన్న నెపంతో..!

Crime News: రోజు రోజుకి ఆడవారి మీద అ అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. చిన్నపిల్లలు, ముసలివారు అని తేడా లేకుండా ఎవరు కనిపించినా కూడా మగాళ్ళు వారి కామవాంఛలు తీర్చుకోవడానికి మృగంలా ప్రవర్తిస్తున్నారు. సమాజంలో ఆడవారికి రక్షణ లేకుండా పోతుంది. మహిళల సంరక్షణకై ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన, ఎంత కఠిన చర్యలు అమలు చేసినా కూడా వారి ఆగడాలకు అంతులేకుండా పోతోంది. తాజాగా ఇలాంటి ఘటన ఆముదాలవలస లో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోకర్ణ పల్లి గ్రామానికి చెందిన మహేష్ అనే యువకుడికి సదరు మహిళతో గత కొంత కాలంగా పరిచయం ఉంది. ఈ క్రమంలో లో సదరు మహిళకు యువకులు ఫోన్ చేసి ఇంటికి వస్తున్నట్లు చెప్పాడు. 4వ తేదీ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ఆమదాలవలస లో ఉన్న మహిళ ఇంటికి చేరుకున్నాడు. ఆమెతో కొంత సమయం మాట్లాడిన తర్వాత తన లైంగిక వాంఛ తీర్చాలని మహిళపై ఒత్తిడి చేశాడు. అందుకు మహిళ నిరాకరించడంతో పక్కనే ఉన్న కత్తెర తీసుకుని ఆమె మెడపై గాయపరిచాడు.

మేడమీద గాయమవడంతో బాధితురాలు గట్టిగా అరిచింది. తనని అలాగే వదిలేస్తే చుట్టుపక్కల వారికి విషయం చెప్తే ప్రమాదమని భావించిన యువకుడు ఆమెను అదే కత్తెరతో వీపు మీద,మెడ మీద 24 సార్లు విచక్షణారహితంగా పొడిచాడు. దాంతో మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో యువకుడికి కూడా స్వల్ప గాయాలు కావడంతో ఇంట్లోనే బాత్రూంలో స్నానం చేసి దుస్తులు మార్చుకుని ఇంటి బయట తాళం వేసి వెళ్ళిపోయాడు. రాత్రి అయినా కూడా మహిళ తలుపు తీయకపోవడంతో స్థానికులు తలుపు బద్దలుకొట్టి చూడగా మహిళ శవమై కనిపించింది.బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.