Crime News: తూర్పు గోదావరి జిల్లాలో దారుణం.. అందరూ చూస్తుండగానే రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య..!

Crime News: ఈ మధ్య కాలంలో యువత చిన్న సమస్య వచ్చినా కూడా దానిని పరిష్కరించకుండా క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో ఇటువంటి దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. అందరు చూస్తుండగానే ఓ యువకుడు రైలు కింద పడి అందరూ చూస్తుండగానే క్షణాలలో ఆత్మహత్య చేసుకోవడంతో అక్కడున్న వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.

వివరాలలోకి వెళితే..తుని రైల్వే స్టేషన్‌లోని ఒకటవ నెంబర్ ప్లాట్‌ఫామ్‌ పై ఈ ఘటన చోటు చేసుకుంది. ఫ్లాట్ ఫామ్ మీద అటూ ఇటూ తిరుగుతూ ఒక యువకుడు నిల్చున్నాడు. ఇంతలో రెండవ నంబర్ ప్లాట్ ఫారం మీద హారన్ వేస్తూ వస్తున్న రైలుని గమనించిన యువకుడు చక చక ఒకటవ నంబర్ ప్లాట్ ఫామ్ దాటుకొని రెండవ నంబర్ ప్లాట్ ఫామ్ పట్టాల మీద వస్తున్న విశాఖ ఎక్స్ప్రెస్ రైలు కు ఎదురు వెళ్తూ రైలు పట్టాల మీద పడ్డాడు. వేగంగా వస్తున్న రైలు ఆ యువకుడి మీదుగా వెళ్ళటంతో యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు మరణించాడు.

క్షణాలలో ఇదంతా జరిగిపోవటంతో అక్కడ ఉన్నవారందరూ షాక్ అయ్యారు . ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు రైల్వే స్టేషన్ లో ఉన్న సీసీ కెమెరా లో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటన గురించి పోలీసులు కేసు నమోదు చేసుకుని యువకుడి వివరాలను సేకరిస్తూ , ఆత్మహత్య కు గల కారణాల గురించి దర్యాప్తు ముమ్మరం చేశారు. యువకుడికి వద్ద ఎటువంటి ఆధారాలు లేకపోవటంతో గుర్తు తెలియని వ్యక్తిగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.