Crime News: కరీంనగర్ జిల్లాలో రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టిన చికెన్ ముక్క…!

Crime News: ఈ రోజుల్లో కొంత మంది ప్రజలు చిన్న చిన్న విషయాలను కూడా పెద్దవి చేస్తూ రాద్ధాంతం చేస్తూ ఉంటారు. కోటి తో పోయే విషయాలను కూడా గొడ్డలితో నరుక్కుని వరకు తీసుకు వెళ్తారు. ఇటీవల కరీంనగర్ జిల్లాలో ఒక చికెన్ ముక్క కోసం రెండు వర్గాల మధ్య ప్రజలు ఒకరిమీద ఒకరు దాడి చేసుకున్నారు.ఈ దారుణ ఘటన కరీంనగర్ జిల్లాలో తీవ్ర ఘర్షణ దారి తీస్తుంది.

వివరాల్లోకి వెళితే… కరీంనగర్ జిల్లా, వేములవాడ మండలం, తిప్పాపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కొనడానికి వచ్చిన వ్యక్తి చికెన్‌ వాసన వస్తోందంటూ ప్రశ్నిచడంతో.. ఇద్దరి మధ్య మాట మాట పెరిగి గొడవకు దారి తీసింది. చికెన్ కొనడానికి వచ్చిన వ్యక్తులు వారిపై దాడికి ప్రయత్నించగా.. చికెన్ సెంటర్ యజమాని వర్గీయులు రివర్స్ లో వచ్చిన వారి మీద రాళ్లతో,కర్రలతో దాడి చేయడంతో గొడవ తీవ్రత పెరిగింది. అంతటితో ఆగకుండా వచ్చిన వారి మీద చికెన్ క్లీనింగ్ కోసం ఉపయోగించే వేడి నీటిని తలపై పోశారు.

చికెన్ సెంటర్ యజమాని తరపు వారు చేసిన దాడిలో ఎదుటి వర్గం వారు ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో గాయపడిన వారిని సిరిసిల్ల ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ గొడవలో యాసిడ్ తో కూడా దాడి చేయడంతో ఇద్దరూ స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఈ దాడికి పాల్పడిన చికెన్ సెంటర్ యజమాని మీద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో యాసిడ్ దాడి ఎలా జరిగిందన్న కోణంలో విచారణ మొదలు పెట్టారు.