లేటెస్ట్ టాక్ : మహేష్ క్రేజీ సినిమాపై క్లారిటీ వస్తుందట.!

సూపర్ స్టార్ మహేహ్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురాం పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ సినిమా కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న చిత్రం గత కొన్ని రోజులు నుంచి రిలీజ్ డేట్ విషయం లో బజ్ నడుస్తున్న సంగతి తెలిసిందే.

రాజమౌళి భారీ సినిమా కోసం మహేష్ వెనక్కి తగ్గుతున్నాడాని కొత్త రిలీజ్ డేట్ కోసం చూస్తున్నారని తెలిసింది. ఇక దీనిపైనే చిత్ర యూనిట్ పక్కా క్లారిటీ త్వరలోనే ఇవ్వబోతున్నారట. రిలీజ్ డేట్ పాతది ఉంటుందా లేక కొత్త డేట్ ఉంటుందా అని దీనిలో క్లారిటీ ఇస్తారట. బహుశా ఈ వారాంతంలో కానీ ఈ వారంలో ఈ అప్డేట్ రావచ్చట. మరి ఈ చిత్రానికి కూడా థమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు నిర్మాణం వహిస్తున్నారు.