Crime News: పేగు బంధాన్ని మరచి కన్న కొడుకునే పొట్టన పెట్టుకున్న తల్లి..!

Crime News: ఈ మధ్య కాలంలో రోజు రోజుకి క్రైమ్ రేటు పెరుగుతూనే ఉంది. పాత కక్షలు, ఆస్తి తగాదాలు,భార్య భర్తల గొడవలు ఇలా ఎన్నో కారణాల వల్ల రోజు ఎంతో మంది హత్యకు గురవుతున్నారు. కానీ కడుపున పుట్టిన వాడి మీద కనికరం లేకుండా ఈ తల్లీ చేసిన పనికి అందరూ ఆశ్చర్య పోయారు. పిల్లవాడి చేష్టలతో విసిగిపోయిన తల్లి కన్న కొడుకునే కాలువలో తోసేసింది. ఈ దారుణ ఘటన తాజాగా నల్గొండ జిల్లాలో శనివారం చోటు చేసుకుంది.

వివరాలలోకి వెళితే..మాడ్గులపల్లి మండలం ఇందుగుల గ్రామానికి చెందిన నల్లగంతుల సోములు, శైలజ దంపతులకు ముగ్గురు కొడుకులు రాజు, యోగేష్, గోపీచంద్.8 సంవత్సరాల క్రితం భర్త చనిపోవడంతో శైలజ కుమారులతో కలిసి నల్గొండ జిల్లాలోని శ్రీనివాస్ నగర్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటుంది. స్థానికంగా అక్కడ ఇళ్ళల్లో పనిచేస్తూ, పిల్లల్ని చదివిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో గోపీచంద్ వయసు పెరుగుతున్న కొద్దీ మతిస్థిమితం తప్పి విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నాడు. మతిస్థిమితం లేనందువల్ల తోటి విద్యార్థులను గాయపరచ్చడటంతో ఈ సంవత్సరం పాఠశాలలో తెచ్చుకోవటానికి నిరాకరించారు.

ఈ క్రమంలో గోపీచంద్ చేష్టలతో విసిగిపోయిన శైలజ శనివారం అతడిని చేసుకొని నల్గొండ నుంచి బస్సులో బయలుదేరి వేములపల్లి మండలానికి చేరుకుంది. అక్కడినుండి సాగర్ ఎడమ కాలువ వంతెన సమీపంలో గోపీచంద్ నీ కాలువలోకి తోసేసింది. అక్కడ ఈత కొడుతున్న ఇద్దరు యువకులు దీనిని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బాలుడి కోసం గాలింపు చేపట్టారు. అయిన ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. పోలీసులు శైలజ ను అదుపులోకి తీసుకున్నారు.