Crime News: అనంతపురం జిల్లాలో దారుణం.. చెల్లెల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని దారుణంగా కొడవలితో నరికి..!

Crime News: ఈ మధ్య కాలంలో ప్రేమకు వయసుతో సంబంధం లేకుండా పోయింది.ఈ రోజుల్లో ప్రేమ పేరుతో చాలామంది మోసపోతున్నారు. పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకోవడంతో పరువు హత్యలు చేయటానికి కూడా పెద్దలు వెనుకాడడంలేదు. తాజాగా అనంతపురం జిల్లాలో ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఇంట్లో పని చేసేవాడు తన చెల్లి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అని కోపంతో దారుణంగా కొడవలితో నరికి చంపాడు.

వివరాల్లోకి వెళితే… అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం లో వెంకటం పల్లి లో దారుణ ఘటన చోటుచేసుకుంది. నీలారెడ్డిపల్లి కి చెందిన నరేంద్ర అనే వ్యక్తి మొదటి భార్యతో కలహాలు రావడంతో ఆమె నుండి విడిపోయి కోనేపల్లిలో నివాసం ఉంటున్నాడు. ఖాళీగా ఉండటం ఇష్టంలేక వెంకటంపల్లిలోని కుల్లాయి స్వామి వద్ద ట్రాక్టర్ డ్రైవర్ గా పనిలోకి చేరాడు. ఈ క్రమంలో కుల్లాయి స్వామి చెల్లెల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య విభేదాలు తలెత్తాయి.

ఇటీవల నరేంద్ర కొత్త ట్రాక్టర్ కొన్నాడు. ఇటీవల సోమవారం రాత్రి ఇసుక లోడుతో వెంకటం పల్లి కి వెళ్ళిన నరేంద్ర ట్రాక్టర్ అక్కడ చెడిపోవడంతో నరేంద్ర ట్రాక్టర్ వద్దకు వెళ్ళాడు. ఈ తరుణంలో తమ చెల్లి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నరేంద్ర మీద కక్ష పెంచుకున్న కుల్లాయి స్వామి, అతని తమ్ముడు కలిసి నరేంద్ర మీద కొడవలితో దాడి చేసి హత్య చేశారు. కొడుకు హత్య గురించి తెలుసుకున్న నరేంద్ర తండ్రి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. నరేంద్ర తండ్రి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.