Crime News: తెలిసిన వాడే కదా అని ఇంట్లోకి రాణిస్తే.. మైనర్ బాలికపై కన్నేసి దారుణం…!

Crime News: ఈ మధ్యకాలంలో చిన్న పిల్లల మీద కూడా అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది.అభం శుభం తెలియని చిన్న పిల్లలకు మాయమాటలు చెప్పి వారిని లోబర్చుకొని కొందరు దుర్మార్గులు వారి మీద అత్యాచారాలకు పాల్పడుతున్నారు. సరదాగా ఆడుకుంటూ కాలం గడపాల్సిన పిల్లలు గర్భవతులుగా మారుతున్నారు. ఇటీవల ముంబైలో ఇటువంటి దారుణ సంఘటన ఒకటి చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే… పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్న నీచుడు మైనర్ బాలిక మీద కన్నేసి చిన్నారికి మాయమాటలు చెప్పి లోబర్చుకొని ఆమెను గర్భవతిని చేసిన ఘటనముంబైలోని ఆంటోప్ హిల్ ప్రాంతంలో చోటు చేసుకుంది. 25 ఏళ్ల వయసున్న వ్యక్తి తన భార్య పిల్లలతో కలిసి ఉంటున్నాడు. ఆ నీచుడు అదే వీధిలో నివాసముంటున్న ఒక బాలిక మీద కన్నేసి తరచూ చిన్నారి ఇంటికి వెళ్తూ ఉండేవాడు. తెలిసిన వాడే కదా అని చిన్నారి తల్లిదండ్రులు కూడా పెద్దగా అనుమాన పడలేదు. ఇదే మంచి అవకాశంగా భావించిన వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికకు మాయమాటలు చెప్పి ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. గత ఐదు నెలలుగా ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకొని బాలిక ఇంటికి వెళ్లి ఆమెమీద నీచానికి పాల్పడుతున్నాడు.

ఇటీవల బాలిక శరీరంలో మార్పులు రావటం,ఆరోగ్యం సరిగా లేకపోవడంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. పరీక్షించిన వైద్యులు బాలిక ఐదు నెలల గర్భవతి అని నిర్ధారించారు. దీంతో బాలిక తల్లితండ్రులు బాలికను నిలదీయగా అసలు విషయం బయట పెట్టింది. బాలిక తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.