Crime News: మరో దారుణం.. విద్యార్థిని గొంతు కోసిన ప్రేమోన్మాది..

Crime News: ఈమధ్య పరువు హత్యలు, పెళ్లి ఇష్టం లేని హత్యలు బాగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా హనుమకొండ లో మరో దారుణం జరిగింది. ఓ ప్రేమోన్మాది విద్యార్థిని గొంతు కోసిన ఘటన చోటుచేసుకుంది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. రంగంపేట మండలం నకిరేపల్లి గ్రామానికి చెందిన అనూష అనే 23 ఏళ్ల యువతి హైదరాబాదులో గ్రూప్స్ కి సిద్ధమవుతుంది.

ఇక మొండ్రాయి గ్రామానికి చెందిన అజార్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో ఆమె వెంట పడి వేధించేవాడు. దీంతో ఆమె నిరాకరించడంతో.. అది మనసులో పెట్టుకొని అతడు.. శుక్రవారం రోజు వరంగల్ కు వచ్చిన అనూష దగ్గరికి వెళ్లి కత్తితో గొంతు కోశాడు. దీంతో వెంటనే అక్కడున్న స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఇక ఆ నేరస్తుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు.