Crime News: కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే కూతురి పాలిట క్రూర మృగంలా …!

Crime News: ఈ మధ్యకాలంలో మహిళల మీద బాలికల మీద రోజు రోజుకి అత్యాచార కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. కొందరిని మగాళ్లు వారి కామవాంఛలు తీర్చుకోవడానికి వావివరుసలు మరచి తల్లి, కూతురు, అక్క, చెల్లి అని కనికరం లేకుండా వారిమీద అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకున్న వారి ఆగడాలకు అంతులేకుండా పోతోంది. ఇటీవల మధ్యప్రదేశ్ లో ఇటువంటి దయనీయమైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే… మధ్యప్రదేశ్ లోని ఖండ్వా జిల్లా, సాక్తాపూర్ గ్రామానికి చెందిన మైనర్ బాలిక తన తండ్రి త్రిలోక్‌చంద్(55)తో కలిసి ఉంటోంది. వయసుకు వచ్చిన కూతురి మీద తండ్రి కన్నేశాడు. ఈ క్రమంలో మైనర్ బాలికనీ తండ్రి త్రిలోక్‌చంద్ బెదిరించి తన కోరికను తీర్చుకోవటానికి కూతురిపై పలుమార్లు ఆత్యాచారం చేశాడు. గత కొన్ని రోజులుగా తన తండ్రి ఇలా చేయటంతో మనస్థాపానికి గురైన బాలిక తన తండ్రి చేసే చర్యను ప్రతిఘటించింది.

కూతురి ప్రతిఘటన తో ఆగ్రహానికి గురైన త్రిలోక్‌చంద్
బాలికపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. తర్వాత బాలికను కత్తితో నరికి.. శరీరాన్ని రెండు ముక్కలుగా చేశాడు. ఆ శరీర భాగాలను గోనె సంచుల్లో కట్టేశాడు. తన బంధువు సహాయంతో సమీపంలోని అజ్మన్‌ నదిలో గోనె సంచి పడేశారు. ఈ క్రమంలో కొందరు స్థానికులు వాడి చర్యను వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాగా అది వైరల్ గా మారింది. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి బాధితురాలి తండ్రినీ, అతనికి సహకరించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.