Crime News: వృద్ధాశ్రమం పేరుతో భార్యతో కలిసి వృద్ధురాలి మీద రిటైర్డ్ ఏఎస్ఐ దారుణం..!

Crime News: ఈ మధ్యకాలంలో కడుపులో మోసి కని పెంచిన పిల్లలకు తల్లిదండ్రులు భారమై పోతున్నారు. చిన్నప్పట్నుంచి పిల్లల ఆలనాపాలనా చూస్తూ ఎంతో కష్టపడి వారి అవసరాలను తీర్చే ప్రయోజకుల్ని చేసిన తల్లిదండ్రులు చూసుకోవటానికి పిల్లలకు మనసు రావడం లేదు. తల్లిదండ్రులన్న ప్రేమ ఆప్యాయతలు మరచి జీవితంలో భార్య పిల్లలతో స్థిరపడిన తర్వాత తల్లిదండ్రులను రోడ్డుమీద వదిలేస్తున్నారు. మరికొందరు తల్లిదండ్రులు ఇంట్లో ఉండి ఆ బాధలు భరించలేక స్వతహాగా వారే వృద్ధాశ్రమాలకు వెళ్తున్నారు.ఈ చలాన్ లో కొందరు వృద్ధాశ్రమాలలో నెలకొల్పి ప్రజలకు సహాయం చేస్తుంటే మరికొందరు మాత్రం వృద్ధాశ్రమాల పేరుతో అమాయకమైన వృద్ధులను చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఇటీవల ఇటువంటి దారుణ ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే…కోడ్చిరా గ్రామ శివారుల్లోని చెన్నమకోరి దేవస్థానం వద్ద ASI గా పనిచేసి పదవీ విరమణ పొందిన బాలకృష్ణాచారి నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో పిల్లలు సరిగా చూసుకోవడం లేదని పెద్దతడూరు గ్రామానికి చెందిన గంగవ్వ అనే వృద్ధురాలు వృద్ధాశ్రమంలో చేరింది. గంగ వద్ద ఉన్న బంగారం డబ్బు చూసిన తర్వాత ఆశ పుట్టిన బాలకృష్ణాచారి గంగవ్వ కు మాయమాటలు చెప్పి డబ్బు బంగారం మీ దగ్గర ఉంటే ప్రమాదమనిమా దగ్గర ఉంచితే నువ్వు తిరిగి వెళ్లేటప్పుడు ఇస్తాము అని చెప్పి మూడు తులాల బంగారు గొలుసు, లక్ష ఇరవై వేల రూపాయల డబ్బు తీసుకున్నాడు.

కొన్ని రోజుల తర్వాత గంగవ్వ కు అవసరం పడటంతో తన డబ్బు నగలు తిరిగి ఇవ్వమని కోరగా మాకు ఎప్పుడూ ఇచ్చావ్ అంటూ వృద్ధురాలు మీద దబాయింపు చేశారు. అంతే కాకుండా వృద్ధురాలు మీద బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన గంగవ్వ ఈ సమాచారాన్ని తన కుమారులకు తెలియజేసింది.గంగప్ప కుమారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గంగవ్వ వద్ద తీసుకున్న మూడు తులాల బంగారు గొలుసు కృష్ణాచారి మహాజన్ అనే వ్యక్తి వద్ద తాకట్టు పెట్టి ఇంటి అవసరాల నిమిత్తం డబ్బులు తీసుకున్నట్లు పోలీసులు విచారణలో రుజువయింది. దీంతో పోలీసులు రిటైర్డ్ ఏఎస్ఐ, అతని కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.