జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్‌

జూబ్లీహిల్స్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. బోధన్‌ ఎమ్మెల్యే స్టిక్కర్‌తో ఉన్న కారు పలువరుని ఢీకొట్టింది. ఈ సంఘటనలో రెండున్నర నెలలున్న పసికందు మృతిచెందగా ఏడాది వయసున్న బాలుడితో పాటు ముగ్గురు మహిళలు గాయపడ్డారు. కారు నడుపుతున్న వ్యక్తి వాహనాన్ని వదిలేసి రోడ్‌ నంబరు 1 వైపు పరారయ్యాడు. స్థానికులు, పోలీసులు గాయపడిన వారిని 108 వాహనంలో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. వీరిలో చికిత్స పోందుతూ.. రణవీర్‌చౌహాన్‌ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.