Crime News: కడుపున కుట్టిన కూతురి పట్ల దారుణంగా ప్రవర్తించిన కసాయి తల్లి దండ్రులు..!

Crime News: ఇటీవల కాలంలో ఆడపిల్ల పుట్టడం తల్లి తండ్రులు చాలా నేరంగా భావిస్తున్నారు . ఆడపిల్ల పుట్టగానే వారిని చంపడం, చెత్తకుప్పలో పడేయటం, లేదా అమ్మటం చేస్తున్నారు.నవమాసాలు మోసి కన్న కూతురిని కనికరం లేకుండా ఇలా అఘాయిత్యాలు చేయటానికి మనసు ఎలా వస్తుందో. కొడుకు పుడితే వంశం నిలబెడతాడు, కుతురితే వారిని పెంచి పెళ్లి చేయటానికి కర్చు అవుతుందని చాలామంది అడ్డంగా వాదిస్తుంటారు. కన్న కూతురిని తల్లి తండ్రులు అమ్ముతున్నారు. ఇలాంటి బాధకర సంఘటన ఇటీవల చోటు చేసుకుంది.

వివరాలలోకి వెళితే.. వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నవమాసాలు మోసి కన్న కూతురిని 20 వేల రూపాయలకు అమ్మేశారు కసాయి తల్లిదండ్రులు.దుర్గా ప్రియ, శ్రీనివాస్‌ దంపతులకు ఇద్దరు కూతుర్లు. మూడవ కాన్పులో కూడా దుర్గా ప్రియా ఆడ శిశువుకు జన్మనిచ్చింది. మూడవ సారీ కొడుకు పుడతాడని ఆశగా ఎదురుచూసిన వారికి కూతురు పుట్టడంతో నిరాశ ఎదురైంది. అందువల్ల 15 రోజుల పసికందును 80 వేల రూపాయలకు అమ్మేశారు. కన్న తల్లిదండ్రులే ఘటనకు పాల్పడటంతో ఈ విషయం తెలిసిన వారు మండిపడుతున్నారు.

గత నెల 21వ తారీకున దుర్గా ప్రియా ఆడ శిశువుకు జన్మనిచ్చింది. మనవరాలి క్షేమ సమాచారాలు తెలుసుకోవడానికి దుర్గా ప్రియ తల్లిగారు ఇంటికి రావడంతో వారు పాపను వేసినట్టు ఆమెకు తెలిపారు. విషయం తెలుసుకున్న ఆమె ఆశ్చర్యానికి గురి అయింది. ఈ సమాచారం పోలీసులకి తెలియటంతో పోలీసులు రంగంలోకి దిగి చైల్డ్‌ ప్రొటెక్షన్ కమిటీకి చిన్నారిని అప్పగించారు. ఈ ఘటనకు పాల్పడిన పాప తల్లిదండ్రులను వారికి సహాయం చేసిన ఆశా వర్కర్ భాషమ్మ, చిన్నారిని కొనుగోలు చేసిన వారిని మొత్తం ఐదు మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆశా వర్కర్ భాషమ్మ సహాయంతో కవిత అనే మహిళ తన చెల్లెలికి పిల్లలు లేకపోవడంతో పాపను కొనీ వారికి ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో 80 వేల రూపాయలు ఇచ్చి పాప ని తీసుకున్నారు.