వైసీపీ పై మ‌రోసారి.. రఘురామ ‌కృష్ణంరాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

ఏపీ ఎంపీ రఘురామ‌కృష్ణంరాజు మ‌రోసారి వైసీపీ పై చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే ఇటీవ‌ల సొంత పార్టీ పై రివ‌ర్స్ అయిన రఘురామ‌కృష్ణంరాజు, వ‌రుస‌గా ప‌లు చాన‌ళ్ళ‌కు ఇంట‌ర్వ్యూలు ఇస్తూ వైసీపీ పై తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే, అయితే తాజాగా ఓ ప్ర‌ముఖ చాన‌ల్‌కు ఇంటర్యూ ఇచ్చిన రఘురామ‌కృష్ణంరాజు వైసీపీ పై మ‌రోసారి వ్యాఖ్య‌లు చేశారు.

ఈ నేప‌ధ్యంలో ఆయ‌న మాట్లాడుతూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌న‌కు ఇచ్చిన అనర్హత పిటీషన్ బుట్టదాఖలే అవుతుందని రఘురామకృష్ణంరాజు తేల్చి చెప్పారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను కేంద్ర ప్రభుత్వం, నిశితంగా గమనిస్తుందని, టైమ్ వ‌చ్చిన‌ప్పుడు కేంద్ర ఎంట‌ర్ అవుతుంద‌ని హెచ్చ‌రించారు. ఇక తన పై వరసగా ప‌లురకాల కేసులు కేసులు పెడుతూ, వైసీపీ త‌న‌ని భ‌య‌పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని, రఘురామ‌కృష్ణంరాజు ఆందోళ‌న వ్యక్తం చేశారు. ఈ క్ర‌మంలో తనకు ప్రాణహాని ఉందని, దీంతో వెంట‌నే, వైసీపీ తీరు పై కేంద్ర ప్ర‌భుత్వం క‌ల్పించుకోవాల‌ని కోరారు. మ‌రి రఘురామ‌కృష్ణంరాజు వ్యాఖ్య‌లు పై వైసీపీ నేత‌లు ఎలా స్పందిస్తారో చూడాలి.