విజయసాయిరెడ్డికి కౌంటర్ వేయాలంటే వెంకన్నేనట 

 

విజయసాయిరెడ్డికి కౌంటర్ వేయాలంటే వెంకన్నేనట 

 
వైసీపీ నేత విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా టీడీపీ మీద, చంద్రబాబు నాయుడు మీద విమర్శలు గుప్పిస్తుంటారు.  ఆయన విమర్శలన్నీ వ్యంగ్యంగానే ఉంటాయి.  ఒక్కోసారి విపరీతమైన రీతిలో కూడా ఉంటాయి.  విమర్శ అంటే ఆలోచనాత్మకంగా ఉండాలి కానీ ఎదుటివారు బాధపడేలా ఉండకూడదు.  కానీ విజయసాయిరెడ్డి ట్వీట్లలో 100 కి 99 విమర్శలు అలానే ఉంటాయి.  ఈ ట్వీట్లతో టీడీపీ నేతలు చాలా సార్లు ఇబ్బందిపడ్డారు.  అయితే ఎన్నిసార్లు బాధపడినా కౌంటర్ వేయలేకపోయారు. 
 
అసలు విజయసాయిరెడ్డి స్థాయిలో వ్యంగ్యమైన ట్వీట్లు వేయగలిగినవారు టీడీపీలో పెద్దగా లేరు.  సీనియర్ నేతలంతా సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండరు.  కానీ ఒక్కరు మాత్రం అడపాడదడపా వైసీపీ నేతలకు ముఖ్యంగా విజయసాయిరెడ్డి ట్వీట్లకు కౌంటర్లు వేస్తుంటారు.  ఆయనే బుద్దా వెంకన్న.  గతంలో పలుమార్లు సాయిరెడ్డి విమర్శలను తిప్పికొట్టిన ఆయన తాజాగా అదే పని చేశారు.  
 
విజయసాయిరెడ్డి చంద్రబాబు విశాఖకు రాకుండానే హైదరాబాద్ వెళ్లిపోవడాన్ని, నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయాలను ప్రస్తావిస్తూ గ్యాస్ బాధితుల్ని పరామర్శిస్తానని సుమోటోగా విజయవాడ నుంచి హైదరాబాద్ వెనక్కి వెళ్ళాడు ఒకాయన.
 
నాకు నేనే సుమోటోగా ఎన్నికల కమిషనర్ని అని ఆర్డర్ ఇచ్చుకున్నాడు ఇంకొకాయన.
అసలు ఈ సుమోటోలు ఏమిటో అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్టు ట్వీట్ వేశారు.  దీనిపై వెంటనే స్పందించిన బుద్దా వెంకన్న సుమోటో అనే పదం మీకు అర్ధం కాకపోవడం ఏంటి విజయసాయిరెడ్డి. సుమోటోగా 16 నెలలు జైలు శిక్ష,సుమోటోగా 11కేసుల్లో ఏ1, ఏ2 ముద్దాయిలుగా ఎదగడం ఇవ్వన్నీ సుమోటోగా చేసుకున్న స్వయంకృతాపరాదాలే కదా అన్నారు. 
 
అంతటితో ఆగకుండా అంతెందుకు మొన్న జగన్ గారు సుమోటోగా మిమ్మల్ని కారులోంచి దించేసి విశాఖ బాధ్యతలను తొలగించారని తాడేపల్లి సంస్థానం టాక్.  అన్నట్టు సుమోటోగా చంద్రబాబు గారి విశాఖ పర్యటనకు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి, వెన్నులో వణుకుపుట్టి @ysjagan గారు ఫ్లైట్స్ రద్దు చేసారు గుర్తులేదా.  సుమోటోగా అల్జిమర్స్ వ్యాధి తెచ్చుకున్నారా సాయిరెడ్డి గారు అంటూ తనదైన శైలిలో సమాధానమిచ్చారు.  వీటిని చూసిన టీడీపీ శ్రేణులు సాయిరెడ్డికి కౌంటర్ ఇవ్వాలంటే వెంకన్నే అంటున్నారు.