రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో ‘డియర్ జిందగీ’ షూటింగ్ ప్రారంభం.

ప్రశాంతమైన కాలనీలో ఉండాలని వచ్చిన ఫ్యామిలీకి వారి పిల్లల వలన ఆ ఫ్యామిలీ ఎలాంటి ఇబ్బందులు పడ్డారు. చివరికి ఆ తండ్రి పిల్లలకి తోడుగా ఉండి సొసైటీలో తన ఫ్యామిలీని చూసి గర్వపడేలా ఎలా చేసుకున్నాడనే ఒక క్రేజీ ఫ్యామిలీ డ్రామా కథే “డియర్ జిందగి”. రాజారవీంద్ర సమర్పణలో ‘సాయిజా క్రియేషన్స్’, మహా సినిమా పతాకంపై రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, నీల ప్రియా, మిర్చి కిరణ్, హర్షవర్ధన్, నటీనటులుగా పద్మారావ్ అబ్బిశెట్టి (పండు) ను దర్శకుడుగా పరిచయం చేస్తూ ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లి లు నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిలిం నగర్ దైవ సన్నిదానంలో పూజా కార్యక్రమాలు ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ప్రముఖ దర్శకుడు వి. వి. వినాయక్ నటుడు రాజా రవీంద్ర పై క్లాప్ ఇవ్వగా, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కెమెరా స్విచ్చాన్ తో పాటు గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో..

నటుడు రాజా రవీంద్ర మాట్లాడుతూ.. రెగ్యులర్ గా కాకుండా కొత్త కాన్సెప్ట్ తో ప్రస్తుతం సమాజంలో జరిగే సమస్యలు ఎత్తి చూపుతూ, మంచి కాన్సెప్ట్ తో తీస్తున్న ఈ సినిమాలో నేను ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఇందులో నాకు ముగ్గురు పిల్లలు ఉంటారు. వీరు చేసే పనులకు ఫ్రస్ట్రేట్ తెప్పించే ఫాదర్ గా చాలా రోజుల తరువాత ఫుల్ లెన్త్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఇలాంటి మంచి సినిమాలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నిర్మాత శరత్ చంద్ర చల్లపల్లి మాట్లాడుతూ..మా సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన వి. వి. వినాయక్ గారికి, కళ్యాణ్ కృష్ణ గారికి ధన్యవాదములు. ఫ్రెండ్స్ తో కోలాబ్రేట్ అయ్యి ప్రేక్షకులకు మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలను అందించాలనే ఉద్దేశ్యంతో ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాము. అయితే దండుపాళ్యం డైరెక్టర్ శ్రీనివాస్ రాజు దగ్గర అసోసియేట్ గా వర్క్ చేసిన పండు నన్ను కలసి ఈ సినిమా కథ చెప్పడం జరిగింది. ఈ కథ మా ఫ్రెండ్స్ కు కూడా నచ్చడంతో ఈ సినిమా తీస్తున్నాము. మాకు రాజా రవీంద్ర గారు కూడా సపోర్ట్ గా నిలవడమే కాకుండా ఇందులో తను నటించడం చాలా సంతోషంగా ఉంది. కథ చాలా బాగుంది. చూసిన వారందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని అన్నారు.

సహ నిర్మాత క్రాంతి ముండ్ర మాట్లాడుతూ..ఇది ఒక మంచి క్రేజీ ఫ్యామిలీ కథ. ‘సాయిజా’ క్రియేషన్స్, మహా సినిమా పతాకంపై ఈ సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మ్యూజికల్ గా కూడా మంచి పాటలు కుదిరాయి. కీరవాణి దగ్గర కీ బోర్డ్ ప్లేయర్ గా పని చేసిన యం.ఎబెనెజర్ పాల్ మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు సినిమాకు తగ్గట్టే పర్ఫెక్ట్ గా నటీ, నటులు, టెక్నిషియన్స్ దొరికారు, చూసిన ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది అన్నారు.

దర్శకుడు పద్మారావ్ అబ్బిశెట్టి (పండు) మాట్లాడుతూ..ఈ కథ రాయడానికి ఒక సంవత్సరం పట్టింది.కల్ట్ వేలో రాసుకున్న ఈ కథ పర్ఫెక్ట్ అనుకున్న తరువాతే నిర్మాత శరత్ గారికి చెప్పడం జరిగింది. తనకు నచ్చడంతో మిగిలిన ఫ్రెండ్స్ అందరినీ తనే మెప్పించడంతో ఈ సినిమా చెయ్యడానికి ముందుకు వచ్చారు. అలాగే రాజా రవీంద్రగారు నాకు గాడ్ ఫాదర్ లాంటి వారు. తను ఫుల్ సపోర్ట్ చేశారు. వారికీ నా ధన్యవాదములు. ఇప్పటి వరకు ఇలాంటి కథ రాలేదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. ఇందులో హీరో అని కాకుండా కథే హీరో, కథకు తగ్గట్టు ఇందులోని ప్రతి క్యారెక్టర్ ఒక ఆర్క్ గా వుంటుంది. ఈ సినిమాకు మంచి నటీ, నటులు, టెక్నిషియన్స్ దొరకడంతో సినిమా బాగా వస్తునందని ఆశిస్తున్నాను. ఇలాంటి మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదములు. అన్నారు.

లిరిక్ రైటర్ రాంబాబు గోశాల మాట్లాడుతూ ..”కాంతారా” సినిమా తరువాత ఈ కథ నచ్చడంతో ఈ సినిమాకు అన్ని పాటలు రాయడం జరిగింది. మంచి కథతో వస్తున్న ఈ సినిమాకు మంచి పాటలు సెట్ అయ్యాయి. ఇలాంటి మంచి సినిమాకు ప్రేక్షకులందరి ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నటుడు శివ చందు మాట్లాడుతూ.. హ్యుమన్ ఎమోషన్ తో వస్తున్న మంచి యూనిక్ సబ్జెక్టు లో నటిస్తున్నాను ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలకు భిన్నమైన పాత్రలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా మా దర్శక, నిర్మాతలకు మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నటి యశస్విని : అనుపమ క్యారెక్టర్ లో చేస్తున్నాను. మిస్ ఇండియా అవ్వబోయే అమ్మాయి కథ.. ఈ సినిమా ఒక క్రేజీ ఫ్యామిలీ డ్రామా. మిడిల్ క్లాస్ అడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యే ఈ సినిమా చూసిన వారందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

నటి నీల ప్రియ..ఇందులో నేను శాంతి క్యారెక్టర్ లో మదర్ గా నటిస్తున్నాను. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయి. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు.

కెమెరామెన్ సిద్ధార్థ స్వయంభు మాట్లాడుతూ .. ఇది ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ. ఇలాంటి మంచి సినిమాకు సినిమాటోగ్రఫీ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.

నటీనటులు : రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, నీల ప్రియా, మిర్చి కిరణ్, హర్షవర్ధన్, మొయిన్, యశస్విని, మోహిత్, ఎల్. వి ప్రసాద్ తదితరులు.

టెక్నీషియన్స్:
ప్రొడ్యూసర్స్ – ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లి
కో ప్రొడ్యూసర్ – క్రాంతి ముండ్ర
డైలాగ్స్ – వినయ్ కొట్టి
ఎడిటర్ – రాజ్ మేడ
మ్యూజిక్ డైరెక్టర్ – ఎమ్. ఎబెనెజర్ పాల్
సినిమాటోగ్రఫీ – సిద్ధార్థ స్వయంభు
పాటల రచయిత: రాంబాబు గోసాల
అడిషనల్ రైటర్ – రఘురామ్ తేజ
డైరెక్టర్ – పద్మారావ్ అబ్బిశెట్టి (పండు)
పి ఆర్ ఓ : కడలి రాంబాబు