ఏడిద శ్రీరాం & ఏడిద రాజా లకు కే.విశ్వనాథ్ స్మారక అవార్డ్ !!

వంశీ ఇంటర్నేషనల్ & వంశీ కల‌్చరల్ ,ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆద్వర్యంలొ శ్రీ శోభాక్రుత నామ సంవత్సర ఉగాది వేడుకలు హైదరాబాద్ త్యగరాయ గాన సభలో ఘనంగా జరిగాయి . ఈ సందర్భంగా వివిధ రంగాల్లోని ప్రముఖులను ఉగాది పురస్కారాలతో సత్కరించారు. ప్రముఖ దర్సకుడు, కళా తపస్వి , దాదాసాహెబ్ పాల్కె అవర్ద్ గ్రహీత శ్రీ కే.విశ్వనాథ్ స్మారక అవార్డ్ , ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత శ్రీ ఏడిద నాగేశ్వరావు కమారులు ఏడిద శ్రీరాం & ఏడిద రాజా లకు బహుకరించారు . శ్రీ వంశీ రామరాజు గారి ఆద్వర్యంలొ వైభవంగా జరిగిన ఈ వేడుకలకి రాష్త్ర ప్రభుత్వ సలహాదారు డా.కే.వి.రమణాచారి ముఖ్య అతిదిగా , అలాగే ప్రముఖ రచయత శ్రీ యండమూరి వీరేంద్రనాద్‍ మరో అతిథిగా వ్యవహిరిచారు. ఈ పురస్కారం అందుకున్న ఏడిద శ్రీరాం మరియు ఏడిద రాజా లు తమకు శ్రీ కే.విశ్వనాథ్ గారితో వున్న అనుబంధం గురించి గుర్తు చేసుకొని తమ సంతోషాన్ని వ్వక్థ పరిచారు .