అను ఇమ్మాన్యుయ‌ల్ చేతుల మీదుగా చంద‌న బ్ర‌ద‌ర్స్ మ‌రో షాపింగ్ మాల్ లాంచ్ !!

తెలంగాణ ప్రజలకు ఎంతో సుపరిచితమైన ప్యాట్నీసెంటర్ చందన బ్రదర్స్ వారి మరో షాపింగ్ మాల్. ఇప్పుడు మన వికారాబాద్ లో గౌరవనీయులు శ్రీ రంజిత్ రెడ్డి (ఎంపి) గారు మరియు గౌరవనీయులు శ్రీ మెతుకు ఆనంద్ (ఎమ్మెల్యే)గారు మరియు గౌరవనీయులు శ్రీమతి మంజుల రమేష్ (మున్సిపల్ చైర్మన్) గారు, ప్రముఖ సినీతార అను ఇమాన్యుయల్ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం జరుపుకున్నది.

ఆ చుట్టుప్రక్కల ఇదే అతి పెద్ద షాపింగ్ మాల్ కావడం విశేషం. వికారాబాద్ లో ఇక్కడే అన్ని హంగులతో 2 అంతస్థులలో 15,000 చ॥ అడుగులలో సువిశాలమైన సకుటుంబ వస్త్ర ప్రపంచం అత్యాధునికంగా అంత‌ర్జాతీయ షాపింగ్ అనుభూతి మీకు అందిస్తూ…కుటుంబమంతటకీ కావలసిన వస్త్రాలు హోల్ సేల్ ధరలకే విక్రయిస్తున్నామనీ… అలాగే సుమారు 100 మందికి ఉపాధి కలిపిస్తున్నామని సంస్థ అధినేత శ్రీ అల్లక సత్యనారాయణ గారు తెలిపారు. ఇంతగా మమ్మలని ఆదరిస్తూ, ప్రోత్సహిస్తున్న తెలంగాణా ప్రజలకు |హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.