Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి పై FNCC తీవ్ర దిగ్భ్రాంతి

Pahalgam Terror Attack: ఐక్యత.. సామరస్యం, రాజ్యాంగ విలువలు పై దాడిని ఖండించిన సభ్యులు. పహల్గామ్‌లో జరిగిన అనాగరిక ఉగ్రవాద దాడి పై ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఉగ్రవాద దాడిలో అమరులైన వారికి కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు..

ఈ సందర్భంగా నిర్మాత, FNCC ప్రెసిడెంట్ కె యస్ రామారావు మాట్లాడుతూ.. పహల్గాం లో జరిగిన అనాగరిక ఉగ్రవాద దాడి పట్ల మేం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాం. ఉగ్ర దాడిలో 26 మంది అమాయక పౌరులు మరణించారు, అనేక మంది గాయపడ్డారు. ఈ చర్యను తీవ్రంగా ప్రతిఘటించాలని అందుకు మోడీ ప్రభుత్వానికి FNCC సంఘీభావం తెలుపుతుందని తెలియజేసారు. అన్ని వేళలా మోడీ ప్రభుత్వం తీసుకునే చర్యలకు మా పూర్తి మద్దతు తెలుపుతామని ఈ సందర్భంగా తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న తుమ్మల రంగారావు మాట్లాడుతూ.. భారత ప్రజలకు మేం సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. శాంతియుత పౌరులపై ఇటువంటి క్రూరమైన చర్యలకు సమాజంలో స్థానం లేదు.. ఈ క్రూర దాడులు ఐక్యత, శాంతి, సామరస్యం అనే రాజ్యాంగ విలువలపై చేసిన ప్రత్యక్ష దాడి అని పేర్కొన్నారు. ఈ దాడి కి కఠినమైన ప్రతిఘటన ఉండాలని మోడీ ప్రభుత్వాన్ని అభ్యర్దిస్తున్నాము. అందుకు మా పూర్తి సహకారం తెలియజేస్తున్నాము.. అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ, నటుడు చిన్నా, బెనర్జీ, ఆది శేషగిరిరావు, కాజా సూర్యనారాయణ తదితరులు పాల్గొని కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు.

కీరవాణి దరిద్రుడు || Cine Critic Dasari Vignan About Keeravani || Singer Sunitha || Pravasthi || TR