పిచ్చుక విూద బ్రహ్మాస్త్రం! మా మీద పడతారేంటి..ప్రభుత్వంపై చిరంజీవి వ్యాఖ్యలు

బాబీ దర్శకత్వంలో చిరంజీవి ` రవితేజ నటించిన చిత్రం ’వాల్తేరు వీరయ్య’ సినిమా కొన్ని థియేటర్లలో 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా… చిత్రబృందమంతా వేడుక చేసుకుంది. ఈ సందర్భంగా మైకందుకున్న చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవును… ప్రత్యేకంగా ఎవరినైనా ఉద్దేశించి అంటున్నారనే విషయంలో పూర్తి స్పష్టత లేనప్పటికీ… తాజాగా ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా… ’యాక్టర్ల రెమ్యునరేషన్‌ పై ప్రభుత్వాలు ఎందుకు మాట్లాడతాయి.

విూలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టులు, ఉద్యోగ`ఉపాధి అవకాశాల గురించి ఆలోచించాలని చిరంజీవిఅన్నారు. ఇదే సమయంలో… ’పేదవారి కడుపునింపే దిశగా ఆలోచించాలి.. అలా చేస్తే అందరూ విూకు తలవంచి నమస్కరిస్తారు. అంతేగానీ, పిచ్చుక విూద బ్రహ్మాస్త్రం లాగా సినీ పరిశ్రమపై పడతారేంటి..’ అని చిరంజీవి స్పందించారు. అనంతరం వాల్తేరు వీరయ్య చిత్ర విజయం తనకెంతో సంతోషాన్నిచ్చిందని చెప్పిన చిరు… ఒకప్పుడు సినిమాలు 100, 175, 200 రోజులు ఆడేవని గుర్తుచేసుకున్నారు.

ఇప్పుడు.. రెండు వారాలే ఆడుతున్నాయని.. ఇలాంటి నేపథ్యంలో వాల్తేరు వీరయ్య 200 రోజులు ప్రదర్శిచడం ఆనందంగా ఉందని చిరంజీవి అన్నారు. కాగా… ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌ లో కలిపి, అనంతరం కేంద్రమంత్రిగా పనిచేసిన చిరంజీవి.. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకు మాత్రమే పరిమితమవుతున్న సంగతి తెలిసిందే. అయితే పవన్‌ కళ్యాణ్‌ పై మంత్రి అంబటి చేసిన వ్యాఖ్యలపై కౌంటర్‌ ఇచ్చే క్రమంలోనే చిరు ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే చిరంజీవి తమ్ముడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ విూటింగ్‌ లో.. రోజుకు తన సినిమా రెమ్యూనరేషన్‌ రెండు కోట్ల అని చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో… ’బ్రో’ సినిమా రెమ్యునరేషన్‌ ఎంతో కూడా చెప్పమంటూ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేయడం హాట్‌ టాపిక్‌ గా మారింది.