సతీష్ వర్మ ‘ఛాంగురే బంగారురాజా’ నుంచి సామిరంగ పాట విడుదల

మాస్ మహారాజా రవితేజ యువ, ప్రతిభావంతులైన ఫిల్మ్ మేకర్స్ తో కంటెంట్-రిచ్ సినిమాలను తీయడానికి ఆర్టీ టీమ్‌వర్క్స్ ని స్థాపించారు. ఆర్ టీ టీమ్‌వర్క్స్ లేటెస్ట్ ప్రొడక్షన్ “ఛాంగురే బంగారురాజా”. ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్‌తో కలిసి చిత్రాన్ని రవితేజ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సతీష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. శ్వేత కాకర్లపూడి, షాలిని నంబు ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రోడ్యుసర్స్.

‘C/O కంచరపాలెం’, ‘నారప్ప’ ఫేమ్ కార్తీక్ రత్నం కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో గోల్డీ నిస్సీ కథానాయిక. రవిబాబు, సత్య ఈ చిత్రంలో ఇతర ప్రధాన తారాగణం. ఇటివలే విడుదల చేసిన ఈ చిత్రం టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ చిత్రం ఫస్ట్ సింగల్ సామిరంగా పాటనివిడుదల చేశారు మేకర్స్. కృష్ణ సౌరభ్ ఈ పాటని క్యాచి ట్యూబ్ గా కంపోజ్ చేశారు. అనురాగ్ కులకర్ణి, నిత్యశ్రీ వెంకటరమణన్ పాడిన ఈ పాటకు కృష్ణ చైతన్య ఆకట్టుకునే సాహిత్యం అందించారు. ఈ పాటలో కార్తీక్ రత్నం డ్యాన్స్ మూమెంట్స్ అలరించాయి.

ఈ చిత్రం కోసం సతీష్ వర్మ కామెడీ ఎంటర్‌టైనర్‌లో ఫ్రెష్ క్రైమ్ జానర్‌ని ఎంచుకున్నాడు. ఈ చిత్రానికి సుందర్ ఎన్‌సి సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. జనార్ధన్ పసుమర్తి డైలాగ్స్ రాసిన ఈ చిత్రానికి కార్తీక్ వున్నవా ఎడిటర్.

ఛాంగురే బంగారురాజా విడుదలకు సిద్ధమవుతోంది.

నటీనటులు: కార్తీక్ రత్నం, సత్య, రవిబాబు, గోల్డీ నిస్సీ, నిత్య శ్రీ, ఎస్తర్ నోరోన్హా, అజయ్ తదితరులు.

సాంకేతిక విభాగం:
నిర్మాత: రవితేజ
బ్యానర్: ఆర్ టీ టీమ్‌వర్క్స్, ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్‌
రచన, దర్శకత్వం: సతీష్ వర్మ
క్రియేటివ్ ప్రోడ్యుసర్స్: శ్వేత కాకర్లపూడి, షాలిని నంబు
సంగీతం: కృష్ణ సౌరభ్
డీవోపీ: సుందర్ ఎన్ సి
ఎడిటర్: కార్తీక్ వున్నవా
ఆర్ట్: నార్ని శ్రీనివాస్
డైలాగ్స్: జనార్దన్ పసుమర్తి
పీఆర్వో : వంశీ-శేఖర్