ప్రియుడితో సరసం, భర్త అంగం కొరికేసిన భార్య

అక్రమ సంబంధాల మోజులో ఎంతకైనా తెగిస్తున్నారు. కట్టుకున్నవారు అన్న ప్రేమ కూడా లేకుండా దారుణాలకు పాల్పడుతున్నారు. ఇవన్నీ సాధారణమైపోయాయి. పనికి రాని సంస్కృతి మోజులో పడి భారత సంస్కృతిని దెబ్బతీస్తున్నారు. భర్తలను కాల్చి చంపుతున్న భార్యలు, నరికి చంపుతున్న భార్యలు ఈ వార్తలే అధికమయ్యాయి. కొన్నాళ్ల క్రితం వరకు భార్యలను చంపిన భర్తలని వినేవాళ్ళం కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతుంది. భార్యలే భర్తలపై దాడి చేస్తున్నారు, చంపేస్తున్నారు. తాజాగా తమిళనాడులో ఓ ఘోరం జరిగింది. అదేంటో మీరే చదవండి.
తమిళనాడులోని వేలూరు జిల్లాకు చెందిన జయంతి తన భర్తను తీసుకొని ఓ ప్రదర్శనకు వెళ్లింది. భర్తను ఓ చోట నిలబెట్టి ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లింది. ఆయన నిలబడి ఎంత సేపు వేచి చూసినా జయంతి తిరిగి రాలేదు. దీంతో కంగారు పడిన భర్త ఆమె కోసం వెతికాడు. ఓ చోట జయంతి తన ప్రియునితో కలిసి అతి సన్నిహితంగా మెలుగుతూ కనిపించింది. అంతే భర్త నివ్వెరపోయాడు. ఇదేంటని జయంతిని నిలదీయగా ఇద్దరి మధ్య కొట్లాట జరిగింది. కొట్లాటలో భర్త పంచె జారి కింద పడగా జయంతి అతని అంగాన్ని గట్టిగా కొరికేసింది. దీంతో మాంసం ముద్దలా కొంత భాగం కిందపడింది. స్థానికులు గమనించి రక్తమోడుతున్న బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. హత్యకు యత్నించిన నేరం కింద పోలీసులు కేసు నమోదు చేసి జయంతిని రిమాండ్ కు తరలించారు.