రిహార్సల్ చేస్తూ ఢీకొని కుప్పకూలిన రెండు జెట్ విమానాలు

ఎయిర్ ఇండియా ఎక్ప్ పోకి ఒక్క రోజు ముందు దారుణం జరిగింది. బెంగుళూరులో భారత వైమానిక దళానికి చెందిన రెండు స్పైస్ జెట్ విమానాలు రిహార్సల్ చేస్తుండగా ఒకదానికి ఒకటి ప్రమాదవశాత్తు డికొని కుప్పకూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు క్షేమంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ విమానంలో పైలెట్లు మాత్రమే ఉన్నారా లేక ఇంకెవరైనా ఉన్నారా అనే దాని పై సమాచారం తెలియాల్సి ఉంది.   

విమానాలు పూర్తిగా దగ్ధం కావడంతో ఘటనా స్థలం వద్ద పెద్దఎత్తున పొగలు వ్యాపించాయి.  నిట్టే మీనాక్షీ ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. ఇస్రో లేఅవుట్, ఎలహంక న్యూటౌన్ ప్రాంతాల్లో విమాన శిధిలాలు పడినట్టు స్థానికులు చెబుతున్నారు.