పూడ్చిపెట్టిన కుమారుడి శవానికి పూజలు చేసిన తల్లిదండ్రులు.. పోలిసుల ఎంట్రీతో ప్లాన్ రివర్స్..?

ప్రస్తుత కాలంలో దేశం రోజురోజుకీ సాంకేతికంగా బాగా అభివృద్ధి చెందుతుంది. ఇలా ఆధునికత వైపుగా దేశం అభివృద్ధి చెందుతూ ఉంటే కొన్ని ప్రాంతాలలో ప్రజలు మాత్రం ఇప్పటికీ మూఢనమ్మకాలను నమ్ముతూ వింత పనులు చేస్తున్నారు. ఇటువంటి వారిని ఆసరాగా తీసుకొని ఎంతోమంది దొంగ బాబాలు వారిని మోసం చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. మాంత్రికుడి మాయమాటలు నమ్మి చనిపోయిన కుమారుడి శవానికి తల్లితండ్రులు పూజలు చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. చనిపోయిన కొడుకు ప్రాణాలతో తిరిగి వస్తాడని ఆశతో ఈ పూజలు చేసిన తల్లిదండ్రులు ప్రస్తుతం కటకటాల పాలయ్యారు.

వివరాలలోకి వెళితే…ఉత్తర్ ప్రదేశ్ లక్నోలోని సైద్ పూర్ గ్రామం లో నివాసం ఉంటున్న దంపతులు తమ కొడుకు ప్రాణాలతో తిరిగి వస్తాడు అన్న ఆశతో సమాధి నుండి కొడుకు శవాన్ని బయటకి తీసి శవానికి పూజలు జరిపిన ఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయంగా మారింది. గ్రామంలో నివాసం ఉంటున్న దంపతులకు మూడేళ్ల క్రితం కొడుకు జన్మించాడు. కొడుకు జన్మించడంతో దంపతులిద్దరూ కొడుకుని అల్లారుముద్దుగా చూసుకుంటూ కొడుకుతో కలిసి సంతోషంగా జీవించేవారు. ఇటీవల ఆ చిన్నారి అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్న కొడుకు ఇలా ప్రాణాలు కోల్పోవటంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు నీరుగా వినిపించారు.

ఆ తర్వాత సాంప్రదాయం ప్రకారం చిన్నారిని సమాధిలో పూడ్చిపెట్టి అంత్యక్రియలు నిర్వహించారు. అదే రోజు రాత్రి ఆ చిత్తారి తడ కలలోకి వచ్చాడని సదరు మహిళ తన భర్తతో పాటు బంధువులందరికీ చెప్పింది. అంతేకాకుండా సమాధి తవ్వి తన కొడుకును బయటకు తీయాలని పట్టు పట్టింది. దీంతో కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఒక మాంత్రికుడిని కలిసి ఆయన సూచన మేరకు సమాధి తవ్వి అందులోనుండి చిన్నారి మృతదేహాన్ని బయటికి తీసి మాంత్రికుడు చెప్పినట్లుగా శవానికి పూజలు నిర్వహించారు. అయితే ఈ విషయం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆ దంపతులను అదుపులోకి తీసుకుని చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్ట్ లో చిన్నారి మరణించాడని తేలడంతో మళ్లీ చిన్నారిని సమాధిలో పూడ్చిపెట్టి అంత్యక్రియలు నిర్వహించారు. పరారీలో ఉన్న మాంత్రికుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.