యాభై వేలు అప్పు తీర్చ నందుకు భార్యని ఎత్తుకెళ్లిన ఫైనాన్షియర్ .. ఆ తర్వాత మరీ దారుణం..?

సాధారణంగా ఆర్థిక సమస్యలు ఉన్నవారు అత్యవసర సమయంలో ఇతరుల వద్ద అప్పు చేస్తూ ఉంటారు. అయితే గడువులోగా అప్పు తీర్చకపోతే విలువైన వస్తువులను తీసుకెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక ఆటో డ్రైవర్ అప్పు తీర్చలేదని బలవంతంగా ఇంట్లోకి చేరబడిన ఫైనాన్షియర్ ఆటో డ్రైవర్ భార్యను ఎత్తుకెళ్లాడు. ఆ తర్వాత ఆమెను ఒక గుడిలోకి తీసుకెళ్లే నుదుటిన సింధూరం పెట్టి తన భార్యగా ప్రకటించాడు. అంతటితో ఆగకుండా ఆమెను బలవంతంగా తన ఇంటికి తీసుకువెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటు చేసుకుంది.

వివరాలలోకి వెళితే…అహ్మదాబాద్‌లో ఆటోరిక్షా నడుపుతూ జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తి.. అజింగ్ సింగ్ చావ్డా అనే ప్రైవేట్ ఫైనాన్షియర్ వద్ద రూ. 50 వేలు అప్పు తీసుకున్నాడు. అయితే గడువులోగా ఆ డబ్బు చెల్లించలేకపోయాడు. దీంతో ఫైనాన్షియర్ అజిత్ సింగ్.. ఆటో డ్రైవర్ ఇంటికి వెళ్లి బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి అతని భార్య(37)ను ఎత్తుకెళ్లాడు. ఆమెను ఒక గుడికి తీసుకెళ్లి.. ఆమె నుదుటిపై సింధూరం పెట్టీ ఆమెను తన భార్యగా ప్రకటించుకున్నాడు. ఆ తన భార్యగా ఆమెను ఇంటికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడేటమే కాకుండా ఈ దారుణాన్ని తన సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరించాడు.ఏదో ఒక విధంగా ఆ ఫైనాన్షియర్ నుంచి తప్పించుకున్న సదరు మహిళ నేరుగా పోలీసులను ఆశ్రయించింది.

అయితే, పోలీసులు ఆమె ఫిర్యాదును స్వీకరించకపోవటంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. పోలీసుల వ్యవహార శైలిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధితురాలు ఫిర్యాదు స్వీకరించవలసిందిగా పోలీసులను ఆదేశించింది . దీంతో పోలీసులు ఫైనాన్షియర్ కేసు నమోదు చేయడంతో అతను కాళ్ళ బేరానికి వచ్చి బాధిత మహిళలు తన భర్తకు అప్పగించడమే కాకుండా పరిహారంగా డబ్బు చెల్లిస్తానని వెల్లడించాడు. అయితే బాధిత మహిళ అందుకు అంగీకరించకపోవడంతో ఫైనాన్షియర్ తన అనుచరులతో కలిసి మహిళ మీద దాడికి ప్రయత్నించాడు. దీంతో ఆమె చేతికి తీవ్రంగా గాయం అయింది. ఈ ఘటన మొత్తం సీసీ కెమెరాలో రికార్డు అవ్వటంతో సీసీ కెమెరా ఆధారంగా పోలీసులు అతని మీద కేసు నమోదు చేసుకుని రిమాండ్ కి తరలించారు.