అయోధ్య కేసు విచారణ బెంచ్ లో తెలుగు జడ్జి రమణకి చోటు

అయోధ్య రామాలయం నిర్మాణానికి సంబంధించిన కేసును విచారించే రాజ్యాంగ ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు మంగళవారం ప్రకటించింది. ఐదుగురు సభ్యులున్న ఈ ధర్మాసనానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వం వహిస్తారు. ఇందులో తెలుగు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ కూడా ఉన్నారు.

మిగతా సభ్యులు ఎవరెవరంటే 

జస్టిస్ ఎస్ ఏ బాబ్డే, జస్టిస్ యూ యూ లలిత్, జస్టిస్ డీ వై చంద్రచూడ్ లున్నారు. ఈ ధర్మాసనం ఈ నెల 23 నుంచి విచారణ జరుపుతుంది. రామజన్మ భూమి యాజమాన్య హక్కుల పై విచారణ జరుగనున్నది.