క్లాసు రూంలో టిచర్ ను నరికి చంపిన ప్రేమోన్మాది

ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. ప్రేమించలేదన్న కారణంతో దారుణాలకు ఒడిగడుతున్నారు. ప్రేమించలేదని  ఓ స్కూల్ టిచర్ ను ప్రేమికుడు క్లాసురూంలోనే నరికి చంపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తమిళనాడులోని కడలూరు జిల్లా కేంద్రంలో గాయత్రి మెట్రిక్యులేషన్ స్కూల్ ఉంది. ఈ స్కూలులో రమ్య అనే యువతి టిచర్ గా పని చేస్తోంది. రమ్యకు ప్రస్తుతం 23 సంవత్సరాలు. రాజశేఖర్ అనే యువకుడు రమ్యకు కాలేజి సమయ నుంచి పరిచయం. గత ఆరు నెలల నుంచి రమ్యను పెళ్లి చేసుకుంటానని రాజశేఖర్ వేధిస్తున్నాడు. రమ్య దీనిని నిరాకరించింది. రాజశేఖర్ రమ్య తల్లిదండ్రులను కలిసి చెప్పినా వారు ఒప్పుకోలేదు.

 దీంతో రమ్య పై రాజశేఖర్ కోపం పెంచుకున్నాడు. రమ్య స్కూల్ లో పిల్లలకు మ్యాథ్స్ క్లాసు బోధిస్తుండగా రాజశేఖర్ నేరుగా క్లాసు రూంకు వచ్చాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో పిల్లల ముందే రమ్య పై విచక్షణా రహితంగా దాడి చేశాడు. దీంతో రమ్య క్లాసురూంలోనే తన ప్రాణాలు విడిచింది. రమ్య పై దాడి జరిగిన సీన్ ను చూసిన చిన్నారులు భయంతో ఒణికిపోయారు. తోటి టిచర్లు చేరుకునేలోపే దారుణం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.