తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం, 10 మంది తెలుగు అయ్యప్ప స్వాముల మృతి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తమిళనాడులోని నిపుదుకోట్టై వద్ద అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. లారీ బస్సు డీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రయాణంలో  మొత్తం పది మంది అయ్యప్ప భక్తులు చనిపోయారు. వీరంతా కూడా ఏపీ, తెలంగాణ ప్రాంతాలకు చెందిన వారుగా తెలుస్తోంది. హైదరాబాద్ కు చెందిన వారు కూడా ఈ ప్రమాదంలో చనిపోయినట్టు సమాచారం. వీరంతా కూడా కేరళలో శబరిమల దర్శనం చేసుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో అయ్యప్ప భక్తులు విషాదంలో మునిగిపోయారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.