కొంతమంది మగ మహానుభావులపై ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టింది హైకోర్టు. వారి అత్యంత అప్రాచ్యపు కళ్ళు ఆడవారిపై పడకుండా శ్రద్ధ పెట్టింది. దేశంలో నెలల శిశువు నుండి మొదలుకుని ముసలివారిని కూడా వదిలిపెట్టని కామ కేటుగాళ్ల భరతం పట్టటానికి కొరడా జులపనుంది న్యాయస్థానం.
లైంగిక వేధింపుల కేసుల్లో నేరస్థులకు విధించే శిక్షలను పరిశీలించటానికి మంగళవారం ఐదుగురు సభ్యుల కమిటీని నియమించింది ఢిల్లీ హైకోర్టు. క్రిమినల్ లా అమెండ్మెంట్ 2018 బిల్లును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఆగష్టు 16 న తదుపరి విచారణ జరగనుంది.
ఈ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టగా సోమవారం ఆమోదం పొందింది. గత ఏప్రిల్ 21 న విడుదల అయిన క్రిమినల్ లా ఆర్డినెన్స్ కి బదులు దీనిని ప్రవేశపెట్టారు. పన్నెండేళ్లలోపు బాలలపై అత్యాచారం చేసిన నేరస్థునికి కఠిన శిక్షలు అమలు చేయనున్నట్టు బిల్లు ప్రతిపాదనలలో ఉంది. కనిష్టంగా నేరస్థులు 20 ఏళ్లపాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. గరిష్టంగా మరణ శిక్ష విధించే అవకాశం ఉన్నట్టు బిల్లు ప్రతిపాదనలో ఉంది. బాధితురాలి వయసుని బట్టి కూడా నేరస్థుని శిక్షస్థాయి ఉంటుంది.
