ప్రియుడి మోజులో పడి ఈ మహిళ ఏం చేసిందంటే

ప్రియుడి మోజులో పడి కన్న బిడ్డల ప్రాణాలు కూడా తీస్తున్నారు. భర్తలను చంపుతున్నారు. ప్రియురాళ్ల మోజులో పడి భార్యలను చంపుతున్నారు. సాంప్రదాయాలకు పుట్టినిల్లైన భారతదేశంలో పాశ్యాత్య సంస్కృతికి అలవాటు పడి అంతా దారితప్పుతున్నారు.

ప్రియుడి మోజులో పడిన ఓ కసాయి తల్లి తన కన్నబిడ్డల ప్రాణాలను తీసింది. భర్తను కూడా చంపాలని ప్లాన్ వేసినా అదృష్టంతో అతను బతికి బయటపడ్డాడు.  తమిళనాడులో ఈ ఘోరం జరిగింది. చైన్నైకి సమీపంలోని కుండ్రత్తూర్ కి చెందిన విజయ్ బ్యాంక్ ఉద్యోగి. అతని భార్య అభిరామి. వీరికి అజయ్, కారుణ్య అనే పిల్లలున్నారు. వీరింటికి సమీపంలోని బిర్యానీ షాపులో పనిచేసే యువకుడు సుందరంతో అభిరామికి ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. మీ ఇంటికి తరచూ ఎవరో వస్తున్నారని ఇంటి చుట్టువారు విజయ్ తో చెప్పడంతో విజయ్ తన భార్యను నిలదీశాడు. తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని అతని అడ్డు తొలగించుకోవాలని అభిరామి మాస్టర్ ప్లాన్ వేసింది.

పిల్లలకు పాలలో, భర్తకు పాలల్లో విషం కలిపి ఇవ్వాలని నిర్ణయించుకుంది. శుక్రవారం రాత్రి పిల్లలకు పాలల్లో విషం కలిపి ఇచ్చింది. అది తాగిన వారు మృతి చెందారు. భర్త అర్ధరాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో పిల్లలు చనిపోయిన విషయం తెలుస్తుందనే భయంతో ప్రియుడితో కలిసి ఆమె ఉడాయించింది. అర్ధరాత్రి వచ్చిన విజయ్ పిల్లలు అచేతనంగా పడి ఉండటం చూసి షాక్ కు గురయ్యాడు. భార్య కోసం వెతికినా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  పోలీసుల విచారణలో విషయమంతా బయటపడింది.అభిరామి కోసం పోలీసులు వెతుకుతున్నారు.

ఏ  పాపం తెలియని పిల్లలు నిర్జీవులుగా మారడంతో విజయ్ కన్నీరు మున్నీరుగా విలపించాడు. విజయ్ దీనస్థితిని చూసిన పలువురు కంటతడి పెట్టారు. ప్రియుడి కోసం కన్నపిల్లలనే చంపుకుందా.. ఈమే ఏం మనిషి అని అంతా అభిరామిని తిట్టారు. నిత్యం ఎన్నో సంఘటనలు బయటపడుతున్నా ఏ మాత్రం భయం లేకుండా అభిరామి దురాఘతానికి ఒడిగట్టిందా అని అంతా చర్చించుకున్నారు.