షబానా ఆజ్మీ, జావేద్ అక్తర్ పాక్ పర్యటన రద్దు

కాశ్మీర్ పుల్వమాలో సిఆర్ పిఎస్ కాన్వాయ్  మీద ఒక ఉగ్రవాద సంస్థ  ఆత్మాహుతి దాడి జరిపి 40 మంది జవాన్లను హతమార్చినందుకు  ప్రముఖ కవి జావేద్ అక్తర్,బాలివుడ్ నటి షబానా ఆజ్మీ  నిరసన తెలిపారు.

ఈ అమానుష దాడిని ఖండిస్తూ  వారు కరాచీ పర్యటనను రద్దు చేసుకున్నారు. షబానా తండ్రి కైఫీ ఆజ్మీ శతజయంతి సందర్భంగా ఆయన కవిత్వం మీద కరాచీ అర్ట్ కౌన్సిల్  ఒక సదస్సు ఏర్పాటు చేసింది. దీనికి  జావేద్, షబానాలను ఆహ్వనించారు. అయితే, సిఆర్ పిఎఫ్ జవాన్లు ను తీవ్రవాదలు  హతమార్చడం తమను కలసి వేసిందని, అందువల్ల ఈ కరాచీ పర్యటను వాయిదా వేసుకున్నట్లు వారు తెలిపారు.

ఈ మేరకు వారు విడివిడిగా ట్వీట్ తమ ఆవేదనను ట్వీట్ చేశారు.