India Vs Pakistan: భారత్ – పాక్ కాల్పుల విరమణ.. ఐక్యరాజ్యసమితి ఏమందంటే..

భారత్, పాకిస్థాన్ మధ్య రోజులు గడిచేలా ఉన్న ఉద్రిక్త వాతావరణానికి చివరికి తాత్కాలిక విరామం లభించింది. రెండు దేశాలు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించడం, శాంతి చర్చలకు ఒక ద్వారం తెరిచినట్లయింది. ఈ పరిణామాన్ని అంతర్జాతీయంగా ఐక్యరాజ్యసమితి (ఐరాస) ఘనంగా స్వాగతించింది. సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ తాము ఈ పరిణామాలను పర్యవేక్షిస్తున్నామని, ఉద్రిక్తతలను తగ్గించే అన్ని ప్రయత్నాలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.

గత కొన్ని రోజులుగా సరిహద్దుల్లో కొనసాగిన కాల్పులు, డ్రోన్ దాడులు, క్షిపణి యుద్ధం క్రమంగా అత్యంత ప్రమాదకర దశకు చేరుకోవడం గమనార్హం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వలన చివరికి రెండు దేశాలూ ఒకేసారి వెనకడుగు వేసే ప్రయత్నం చేయడం జరుగుతోంది. ఈ క్రమంలో శనివారం ఇండియా-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యింది.

ప్రమాదకర పరిణామాల క్షణంలోనూ ఒక మెట్టు వెనక్కి వేయగలిగిన భారత, పాకిస్థాన్ నిర్ణయాన్ని ఐరాస కీలకంగా పరిగణిస్తోంది. “ప్రస్తుత పరిస్థితేంటన్నది మేము జాగ్రత్తగా గమనిస్తున్నాము. శాంతికి అవకాశాలు ఇచ్చే ప్రతీ ప్రయత్నాన్ని మేము స్వాగతిస్తాము” అని ఉప ప్రతినిధి ఫర్హాన్ హక్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు పరిస్థితులు ఎంత సున్నితంగా మారిపోయాయో సూచిస్తున్నాయి.

ఇప్పుడిప్పుడే సాధారణ స్థితి దిశగా అడుగులు పడుతున్నా, ప్రజల్లో భయం ఇంకా పూర్తిగా తొలగలేదు. సరిహద్దు గ్రామాల ప్రజలు, బంకర్లలో గడిపిన రోజులు, నిద్రలేని రాత్రులు మరచిపోలేనివి. వీరి కోసం శాశ్వత పరిష్కారాలే అవసరం, తాత్కాలిక ఒప్పందాలు కాదు అని ఐక్యరాజ్యసమితి అధికారులు వివరణ ఇచ్చారు. అంతిమంగా, ఈ విరమణ శాంతి రేయికి నాంది కావాలని ప్రపంచం కోరుకుంటోందని కూడా తెలిపారు. ఇక పాక్ వక్రబుద్ది ఇప్పటికైనా మారుతుందేమో చూడాలి.

ఈ దెబ్బతో పాకిస్తాన్ మ్యాప్ లో కూడా కనపడదు..| BRS Activists About Operation Sindoor | Telugu Rajyam