ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య ఓటు ఎవరికి వేసిందో తెలుసా

బుధవారం పాకిస్థాన్ లో  ఎన్నికలు జరిగాయి. పాకిస్థాన్ మాజీ క్రికెటర్, పిటిఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ ఈ ఎన్నికల్లో తన ఓటును ఎవరికి వేసిందో తెలుసా. ఇవాళ జరిగిన ఎన్నికల్లో తాను ఓటేశానని, ఆ ఓటు పిల్లికి వేశానని రెహమ్ ఖాన్ తన ట్వీట్టర్ ద్వారా వెల్లడించింది. వాస్తవానికి రెహమ్ ఖాన్ ఎవరికి ఓటు వేసిందో అన్న దానిపై స్పష్టత లేదు. ఆమె ట్వీట్ ను అంచనా వేసిన కొందరు ఆమె నవాజ్ షరీఫ్ కు చెందిన  పీఎంఎల్‌ఎన్ పార్టీకి ఓటెసినట్టు అనుమానిస్తున్నారు. షరీఫ్ పార్టీ గుర్తు పులి.కాబట్టి పులిని పోలే విధంగా పిల్లిని ట్యాగ్ చేసిందని నెటిజన్లు  అభిప్రాయపడుతున్నారు. ఇమ్రాన్ కు రెహమ్ చాలా రోజుల క్రితమే విడాకులిచ్చింది. ప్రస్తుతం ఆమె టివి ఛానల్ లో యాంకర్ గా పనిచేస్తుంది. ఆమె ఎట్టి పరిస్థితిలోను తన మాజీ భర్త ఇమ్రాన్ పార్టీకి ఓటు వేసి ఉండదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.