జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి రోజును పండుగగా నిర్వహించారు హిందూ మహాసభ ప్రతినిధులు. ఓ దిష్టిబొమ్మకు మహాత్ముడి నిలువెత్తు చిత్రపటాన్ని అమర్చి, బొమ్మ తుపాకీతో పాయింట్ బ్లాంక్ రేంజ్లో షూట్ చేశారు. ఆ దిష్టిబొమ్మ నుంచి రక్తం కారుతున్నట్టుగా ఎర్రరంగును పులిమారు. అనంతరం స్వీట్లు పంచుకున్నారు. పరస్పరం అభినందనలు తెలియజేసుకున్నారు. అక్కడితో ఆగలేదు. మహాత్ముడిని హతమార్చిన నాథూరామ్ గాడ్సే విగ్రహానికి పూజలు చేశారు. నివాళి అర్పించారు. ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. హిందూమహాసభ జాతీయ కార్యదర్శి పూజా శకున్ పాండే, ఆమె అనుచరులు ఈ దారుణానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
Watch: Hindu Mahasabha recreates Mahatma Gandhi’s assassination; shoots Gandhi's effigy pic.twitter.com/jhCKmvjAMe
— Afroz Alam (@AfrozJournalist) January 30, 2019