భర్త చెప్పిన మాట వినలేదని భార్య పట్ల కిరాతకంగా ప్రవర్తించిన భర్త… ఏం చేశాడో తెలుసా?

సాధారణంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు తలెత్తుతూ ఉంటాయి. అయితే భార్యాభర్తలిద్దరూ సర్దుకుపోవటం వల్ల ఆ గొడవలు సర్దుమణుకుతాయి. కానీ కొన్ని సందర్భాలలో ఇద్దరి మధ్య మొదలైన చిన్న చిన్న గొడవలు కూడా తారస్థాయికి చేరుకొని దారుణాలకు దారితీస్తాయి. భర్త చెప్పిన మాట నిరాకరించినందుకు భార్యకి గుండు కొట్టించిన ఘటన ఉత్తరప్రదేశ్లోని మీరట్లో చోటుచేసుకుంది. ఈ దారుణ సంఘటన స్థానికంగా సంచలనంగా మారింది .

వివరాలలోకి వెళితే..లిసాడి గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పరిధిలో నివసిస్తున్నఅలీషా, షరీక్ దంపతులకు 5 నెలల క్రితమే వివాహం జరిగింది. భర్త షరీక్ రోజూ తాగి ఇంటికి వచ్చి భార్యతో తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలో ఇటీవల కూడా మద్యం సేవించి తన స్నేహితులను వెంటబెట్టుకొని ఇంటికి వెళ్ళాడు. ఆ తర్వాత తన స్నేహితులతో గడపమని భార్యని బలవంతం పెట్టాడు. అయితే అందుకు ఆమె తీవ్రంగా నిరాకరించింది. భార్య నిరాకరించటంతో తీవ్ర ఆగ్రహానికి గురైన షరీక్.. భార్యకు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు దుశ్చర్య కు పాల్పడ్డాడు. తన స్నేహితులతో గడపటానికి నిరాకరించిందన్న కోపంతో ఆమె స్పృహతప్పగానే గుండు కొట్టించాడు.

ఆ తర్వాత కొంత సమయానికి అలీషా స్పృహలోకి వచ్చి చూడగా.. తన జుట్టును కట్ చేసినట్లు గుర్తించి షాక్ అయ్యింది. భర్త చేసిన నిర్వాకానికి తీవ్ర ఆగ్రహానికి గురైన అలీష్.. నేరుగా పోలీసులను ఆశ్రయించింది. భర్త షరీక్ అరాచకాలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కట్నం గురించి వేధించడమే కాకుండా, తనను వేరే వ్యక్తులతో వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేస్తున్నాడని, అందుకు ఒప్పుకోకపోవడంతో గుండు కొట్టించాడని ఫిర్యాదులో పేర్కొంది అలీషా. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా షరీక్‌, అతని తల్లిదండ్రులను అదుపులోకి తీసుకొని విచారించగా అలీషాను బలవంతం చేయబోయిన ఫరీక్‌ స్నేహితులను అరెస్ట్‌ చేశారు.

భార్యకు గుండు కొట్టించిన భర్త.. కారణం తెలిస్తే  ఏంచేస్తారో మీకే తెలీదు.. - TV9