బిగ్ బ్రేకింగ్… కాంగ్రెస్ పార్టీలో ఒక్క టికెట్ ను 3 కోట్లకు అమ్ముకున్నారు (ఆడియో టేపు)

రంగారెడి జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత క్యామ మల్లేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఒక్కో ఎమ్మెల్యే సీటుకు 3 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీలో గొల్ల కుర్మలకు అన్యాయం జరిగిందని బిసిల సీట్లలో కూడా రెడ్డిలకే అధిక ప్రాధాన్యమిచ్చారన్నారు.

స్క్రీనింగ్ కమిటి చైర్మన్ భక్త చరణ్ దాస్ ఒక్కో అసెంబ్లీ సీటుకు 3 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారన్న ఆడియోను మల్లేష్ విడుదల చేశారు. ఖైరతాబాద్ లో గెలవలేని దాసోజు శ్రావణ్ వద్ద 10 కోట్లు తీసుకొని టికెటిచ్చారన్నారు. తను 40 ఏండ్ల నుంచి పార్టీలో ఉంటే తనకు గుర్తింపు లేదన్నారు.

భక్త చరణ్ దాస్ కొడుకు సాగర్ క్యామ మల్లేష్ కొడుకు అంజన్ కుమార్ యాదవ్ ను డబ్బులు డిమాండ్ చేసిన ఆడియో కింద ఉంది వినండి. పది నిమిషాల పాటు ఆడియో ఉంది.