కేంద్ర విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీకే కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..?

దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, ఐఐటి, ఐఐఎం ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో 11 అధ్యాపక పోస్టులు భర్తీ చేయనున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ వెల్లడించారు.ఈ మేరకు తాజాగా సోమవారం జరిగిన లోక్సభ సమావేశంలో కేంద్రమంత్రి ఒక ప్రశ్నకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు.

దేశవ్యాప్తంగా ఉన్న 45 కేంద్ర విశ్వవిద్యాలయాల్లో 18,956 పోస్టులు మంజూరు కాగా, 6,180 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఐఐటీల్లో 11,170 పోస్టులు మంజూరవ్వగా, 4,502 ఖాళీ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే ఐఐఎంలలో 1,566 పోస్టులు మంజూరు కాగా, 493 ఖాళీ పోస్టులు ఉన్నాయని మంత్రి వెల్లడించాడు. దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, ఐఐఎంలలో ఖాళీగా ఉన్న పోస్టులో 961 పోస్టులు ఎస్సీ రిజర్వ్డ్ ఉండగా.. 578 పోస్టులు ఎస్టీ రిజర్వ్ డ్ లో ఉన్నాయి. ఇక 1657 పోస్టులు ఓబీసీ కేటగిరి కింద ఉన్నాయని ఆయన వెల్లడించారు. అంతే కాకుండా ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ కేటగిరిలో వరుసగా 643, 301 ఖాళీ పోస్టులు ఉన్నాయని కేంద్ర మంత్రి వెల్లడించారు.

అంతేకాకుండా ఎన్ సి ఎల్ టి (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్) లో దాదాపు సగం పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఎన్ సి ఎల్ టి కి వేరు వేరు ప్రాంతాలలో ఉన్న బ్రాంచులన్నింటిలో 1 ప్రెసిడెంట్ తోపాటు 31 మంది జ్యూడీషియల్, 31 మంది టెక్నికల్ సభ్యులు ఉండాలన్నారు. కానీ ప్రస్తుతం 1 ప్రెసిడెంట్ తోపాటు 18 మంది జ్యూడీషియల్, 19 మంది టెక్నికల్ సభ్యులే పని చేస్తున్నారని పేర్కొన్నారు. మిగిలిన పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.