తమిళనాడులో దారుణం… యువతి మీద దాడి చేసి నడి రోడ్డులో పడేసిన దొంగ..!

ప్రస్తుత కాలంలో కొంతమంది సులభంగా డబ్బు సంపాదించడానికి అడ్డదారులు తొక్కుతున్నారు. ఈ క్రమంలో దారిదోపిడీలు, దొంగతనాలు, మోసాలు చేస్తున్నారు. అయితే ఇటువంటి దొంగతనాలను అరికట్టటానికి ప్రభుత్వాలు చర్యలు చేపట్టినప్పటికీ దొంగల తీరు మాత్రం మారటం లేదు. పట్టపగలు అందరూ చూస్తుండగానే దాడులు చేసి దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా తమిళనాడులో కూడా ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది. రోడ్డుమీద వెళ్తున్న యూతి మీద దాడి చేసిన దొంగ ఆమె డబ్బు నగలతో పాటు బైక్ కూడా ఎత్తుకెళ్లాడు. అయితే స్థానికులు ఆ దొంగని అడ్డుకోకుండా చోద్యం చూస్తూ వీడియోలు తీశారు.

వివరాలలోకి వెళితే…తమిళనాడులోని తిరుచ్చిలో బైక్‌ని ఎత్తుకెళ్లడానికి దొంగ ఒక యువతి మీద దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది. బైక్ దొంగలించడానికి ప్రయత్నించడంతో యువతి అడ్డుపడగా ఆ దొంగ ఆమె మీద దాడి చేశాడు. ఈ దాడిలో యువతి అపస్మారక స్థితిలోకి చేరుకున్న తర్వాత అందరూ చూస్తుండగానే నడిరోడ్డు మీద
ఆమెను లాక్కొచ్చి వదిలేశాడు. అంతేకాకుండా ఆమె శరీరం మీద ఉన్న బంగారు గొలుసు ఆమె వద్ద ఉన్న డబ్బులు తో పాటు బండి కూడా దొంగలించి అక్కడి నుండి పారిపోయాడు.

అయితే స్థానికులు ఈ కట్టడం మొత్తం చూస్తున్నప్పటికీ ఆ దొంగను అడ్డుకోకపోవటమే కాకుండా వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయటం బాధాకరమైన విషయం. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వీడియో ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు.