బీహార్ రాష్ట్రంలో 34 మంది మైనర్ బాలికలు పై అత్యాచారం!

బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో ఆశ్రయ నివాసంలో 34 మంది బాలికలు అత్యాచారానికి గురయ్యారని పోలీసులు తెలిపారు.

ముజఫర్పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పి) హర్ప్రీత్ కౌర్ మాట్లాడుతూ .. “ముజఫర్ పూర్ ఆశ్రయం వద్ద 34 మంది బాలికలు అత్యాచారానికి గురయ్యారు. 42 మంది బాలికలకు  మెడికల్ పరీక్షలు గత వారం నిర్వహించగా ఈ విషయం వెల్లడైందని తెలిపారు .

ప్రతిపక్షాల ఒత్తిడి కారణంగా, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గురువారం సిబిఐ దర్యాప్తునకు సిఫార్సు చేశారు.