Prashanth neel : కళ్ళు చెదిరే ఓవర్ సీస్ బిజినెస్ చేసిన ప్రభాస్, యష్.. ఎన్ని కోట్లో తెలుసా..?

 

Prashanth neel: కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ప్రశాంత్ నీల్, 2014వ సంవత్సరంలో ఉగ్రం సినిమా ద్వారా పరిచయం అయ్యాడు. 2018లో యాష్ హీరో గా ప్రశాంత్ నీల్ కే జి ఎఫ్ చాప్టర్1 సినిమా ను చిత్రీకరించారు. ఈ సినిమా కన్నడ సినీ పరిశ్రమలోనే అత్యధిక వసూళ్లు తెచ్చిపెట్టిన చిత్రంగా నిలిచిపోయింది. కే జి ఎఫ్ చాప్టర్ వన్ విజయం తర్వాత ప్రశాంత్ నీల్ కు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.

ప్రస్తుతం ప్రశాంతి నీల్ కే జి ఎఫ్ చాప్టర్ 2 చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో యష్, సంజయ్ దత్, శ్రీనిధి శెట్టి ,రవీనా టాండన్, ప్రకాష్ రాజ్ లు నటిస్తున్నారు. ఈ సినిమా దేశంలోనే ఆతృతగా ఎదురు చూసే సినిమాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఏప్రిల్ 14 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ప్రస్తుత వార్తా కథనాల ప్రకారం, యష్ హీరోగా నటించిన కే జి ఎఫ్ చాప్టర్ 2, ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాలకు సంబంధించిన ఓవర్సీస్ బిజినెస్ అప్పుడే జరిగిపోయిందని సమాచారం. ఈ రెండు సినిమాలకు సంబంధించిన ఓవర్సీస్ రైట్స్ ను ఫార్స్ ఫిలిమ్స్ 100 కోట్ల భారీ మొత్తానికి దక్కించుకుందని అని సమాచారం. బాహుబలి,ఆర్ ఆర్ ఆర్ కాకుండా మిగిలిన భారతీయ సినిమాలకు ఇది ఒక పెద్ద డీల్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాల విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ సలార్ సినిమా కు సంబంధించి షూటింగ్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది.

2020 డిసెంబర్ 2న సినిమా ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన చేశారు. ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న మొదటి చిత్రమిది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తున్నారు. ఈ సినిమాని తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు.
ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ సలార్ సినిమా గురించి మాట్లాడుతూ ఏ సినిమాలో ప్రభాస్ ని ఇంతవరకు ఎప్పుడు చూపించని విధంగా చూపిస్తున్నట్లు చెప్పారు . చాలా నమ్మకంగా చెబుతున్నాను కానీ ఆయన సలార్ సినిమాలోని ప్రభాస్ క్యారెక్టర్ గురించి చెప్పాడు. ప్రభాస్ మాట్లాడుతూ ఈ సినిమా చాలా ఆసక్తికరంగా ఉంటుందని సినిమాలో నేను చాలా క్రూరంగా కనిపిస్తానని చెప్పాడు. ఇలాంటి పాత్రలు ఇంతకుముందు ఎప్పుడూ నటించలేదు అని ఆయన చెప్పారు