ఎన్.టి.ఆర్ కోసం ఆ దర్శకుడు జాన్వీకపూర్ ని తీసుకురాగలడా ..?

ఎస్ ఎస్ రాజమౌళి బాహుబలి ఫ్రాంఛైజీ తర్వాత అంతకు మించి అన్నట్టుగా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ లతో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘రౌద్రం రణం రుథిరం’. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డీవీ దానయ్య దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా కేటగిరీలో ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, అజయ్ దేవగన్, శ్రియ శరణ్, ఓలియా మోరిస్..ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 2021 సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ చేయాలని దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ నెల 22 న కొమరం భీమ్ టీజర్ రానుంది.

RRR NTR Scene Leaked Video | Movie First Look Komaram Bheem | Rajamouli |  Ram Charan - YouTube

ఇక ఎన్.టి.ఆర్ తన 30 వ సినిమాని మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ తో చేస్తున్నాడు. అయినను పోయిరావలె హస్తినకు అన్న టైటిల్ ప్రచారంలో ఉంది. కాగా ఈ సినిమాని పాన్ ఇండియా కేటగిరీలోనే రూపొందిస్తున్నారు. హారిక అండ్ హాసిని, ఎన్.టి.ఆర్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కి స్థానం ఉందని అంటున్నారు. కాగా ఇప్పటికే ఎన్.టి.ఆర్ – త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సినిమాలో హీరోయిన్ గా నటించిన పూజా హెగ్డే హీరోయిన్ ని ఎంచుకున్నారని అంటున్నారు. కాని ఇందుకు సంబంధించిన అఫీషియల్ న్యూస్ మాత్రం ఇంకా రాలేదు.

NTR 30 Movie | Cast, Release Date, Trailer, Posters, Reviews, News, Photos  & Videos | Moviekoop

అయితే ఇప్పుడు ఈ సినిమాలో ఉన్న సెకండ్ హీరోయిన్ కోసం అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్ ని నటింప చేయాలని మేకర్ భావిస్తున్నట్టు ఇంతకముందే వార్తలు వచ్చాయి. కాని జాన్వీ నిజంగా ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకుంటుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. అంతేకాదు ఇటీవల బాలీవుడ్ లో నెపొటిజం కారణంగా జాన్వీ ట్రోల్ కి గురౌతున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో జాన్వీ టాలీవుడ్ సినిమాలో నటిచడానికి మేకర్స్ తీసుకు రావడం కరెక్టేనా అన్న టాక్ కూడా ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. కాని ఎన్.టి.ఆర్ – జాన్వీ కపూర్ కాంబినేషన్ మీద మాత్రం ఫ్యాన్స్ క్రేజీగానే ఉన్నారు.