సాయి పల్లవి మీద పగ పట్టేశారేంటీ.!

సినీ ఇండస్ర్టీలో రైవలరీస్ ఎక్కువైపోతున్నాయ్. పని గట్టుకుని కొందరు పీఆర్ టీమ్స్ పేరు చెప్పి దుష్ప్రచారం మొదలు పెడుతున్నారు. హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లూ, ప్రొడ్యూసర్లూ ఇలా ఏ ఒక్కరూ అతీతం కారీ వ్యవహారంలో.

టార్గెట్ చేయడమే సదరు పీఆర్ టీమ్‌ల పని. సర్వ సాధారణ విషయంగా దాపురించిందీ సంస్కృతి కొత్తగా సినీ ఇండస్ట్రీలో. ఈ అనవసరమైన దుష్ప్రాచారాల వల్ల పలువురు సెలబ్రిటీల కుటుంబ సభ్యులూ, సన్నిహితులూ తీవ్రంగా ఎఫెక్ట్ అవుతున్నారు.

కొన్ని సందర్భాల్లో ఆయా సెలబ్రిటీల కెరీర్ ఖతమైపోవడానికి కూడా ఈ పీఆర్ దుష్ప్రచారాలు కారణమవుతున్నాయ్. తాజాగా సాయి పల్లవి విషయంలో ఇదే జరిగింది. అప్పుడెప్పుడో ఓ సినిమా ప్రారంభోత్సవం టైమ్‌లో జరిగిన పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటో పట్టుకుని ఇప్పుడు సాయి పల్లవిని బదనాం చేసేందుకు పూనుకుంది ఓ పీ ఆర్ టీమ్.

కొన్ని అభిమాన సంఘాలతో కుమ్మకై ఇలాంటి దుష్ప్రచారానికి దిగుతున్నాయ్ సదరు పీఆర్ టీమ్స్. అయితే, సాయి పల్లవి ఎంత మాత్రమూ బెదరలేదు. తాజాగా సోషల్ మీడియా వేదికగా రెస్పాండ్ అయ్యింది. కొందరు పని లేని వాళ్లే ఇలాంటి దుష్ర్పచారాలకు పూనుకుంటున్నారంటూ మండి పడింది.

ఈ విషయమై ఓ లీగల్ టీమ్ సాయి పల్లవి వెనకాల స్ట్రాంగ్‌గా వర్క్ చేస్తోందట. ఓ పీఆర్ టీమ్ కనుసన్నల్లోనే ఈ ప్రచారానికి తెర లేచిందని సదరు టీమ్ ప్రాధమికంగా తేల్చింది. కొందరు తెలుగు సినీ అభిమానుల ప్రోద్భలం కూడా ఈ వ్యవహారంలో వుందని సాయి పల్లవి సన్నిహితులు అనుమానిస్తున్నారు.