అందాలతార రకుల్ ప్రీత్ సింగ్ కు ఆ రెండు సినిమాల వల్లే ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలిసొచ్చిందట. ఇంతకీ ఆ రెండు సినిమాలు ఏవి అనేగా మీ డౌటు? అందులో ఒకటి ‘మిస్టర్ పర్ఫెక్ట్’ అయితే, మరోటి ‘ఆటోనగర్ సూర్య’.

అసలు విషయంలోకి వెళితే.. ప్రభాస్ హీరోగా కాజల్, తాప్సీ హీరోయిన్లుగా 2011లో వచ్చిన సూపర్హిట్ సినిమా ‘మిస్టర్ పర్ఫెక్ట్’ లో కాజల్ పాత్ర కు ముందుగా రకుల్నే అనుకున్నారంట. ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమాలో రకుల్ను హీరోయిన్గా సెలక్ట్ చేసి నాలుగు రోజులు షూటింగ్ కూడా చేశారట. అప్పుడు ఆమెకు డిగ్రీ పరీక్షలు ఉండటంతో.. సెట్లో ఎప్పుడూ పుస్తకాలతో కుస్తీ పట్టేదట. కొత్త హీరోయిన్ కావడం.. ఆమెకు సినిమాల గురించి తగిన అవగాహన లేకపోవడంతో రిస్కు ఎందుకని నిర్మాతలు రకుల్ను తప్పించి.. ఆమె ప్లేస్లో కాజల్ అగర్వాల్ను తీసుకున్నారు.
నాగచైతన్య హీరోగా వచ్చిన ‘ఆటోనగర్ సూర్య’లో ముందుగా సమంతను తీసుకున్నప్పటికీ ఆమె డేట్సు అడ్జస్ట్ చేయలేకపోయిందట. దీంతో ఆమె ప్లేస్లో రకుల్ను తీసుకున్నారు. ఆ వెంటనే సమంత డేట్సు ఇవ్వడంతో రకుల్కు నిరాశ తప్పలేదు. ఆ రెండు సినిమాల వల్లే తనకు సినిమా ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలుసొచ్చిందని రకుల్ కొన్ని సందర్భాల్లో చెప్పుకొచ్చింది.
తక్కువ సినిమాలతోనే స్టార్ హీరోయిన్గా ఇమేజ్ సాధించిన హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ 2011లో ‘కెరటం’ సినిమాతో తెలుగులో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత రెండేళ్ల కు ఆమెకు 2013లో ‘వెంకటాద్రి ఎక్సు ప్రెస్’తో బ్రేక్ వచ్చింది. అప్పటి నుంచి రకుల్ప్రీత్ సింగ్ వరుస సినిమాలతో బిజీగా మారిపోయి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో పాటు, నితిన్ హీరోగా నటిస్తున్న ‘చెక్’ సినిమాలోనూ హీరోయిన్గా నటిస్తున్నారు. ఆమెతోపాటు ప్రియా ప్రకాశ్ వారియర్ మరో హిరోయిన్గా కనిపించనున్నారు.
