జీన్స్ హీరో కెరీర్ నాశనం అవ్వడానికి కారణం ఎవరో తెలిస్తే షాక్ అవుతారు?

కెరియర్ పరంగా మనకు మంచి పోసిషన్ ఉన్నప్పుడు నాలుగు రాళ్లు సంపాదించుకోవాలని అందరూ ప్రయత్నిస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం పరిస్థితి చాలా భిన్నంగా మారింది. హీరోగా మంచి డిమాండ్ ఉన్న రోజుల్లోనే అవకాశాలకు గండి కొట్టుకున్న ప్రశాంత్ దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నాడు.

కోలీవుడ్ స్టార్ సీనియర్ హీరో అయిన ప్రశాంత్ కు తమిళంతో పాటు తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. నిర్మాత త్యాగరాజన్ కుమారుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్ చాలా తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ముఖ్యంగా ఆయన శంకర్ డైరెక్షన్ లో డ్యూయల్ రోల్ చేసిన జీన్స్ సినిమాను ఇప్పటికీ మర్చిపోలేము. ఈ సినిమాతో ప్రశాంత్ కెరీర్ సక్సెస్ ఫల్ లాంగ్ టర్న్ తీసుకుంది. ఇక ఆ తరువాత కెరీర్ పై ఇంట్రెస్ట్ తో పాటు సినిమాలు కూడా తగ్గిపోవడంతో చాలా కాలం స్క్రీన్ కు దూరంగా ఉన్నాడు ప్రశాంత్.

అయితే ముందుగా సెల్వమణి దర్శకత్వంలో చామంతి సినిమా ద్వారా రోజా, ప్రశాంత్ లను హీరోహీరోయిన్లుగా పరిచయం చేయడం జరిగింది. దీంతో దొంగ దొంగ అనే సినిమా మణిరత్నం దర్శకత్వంలో చేసి మంచి హిట్ సాధించింది. ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో వచ్చిన జీన్స్ లో కూడా నటించడం జరిగింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. అందులో ఐశ్వర్య రాయ్ కథానాయికగా నటించింది.

ఇక తెలుగులో కలిసి తొలిముద్దు సినిమాలో నటించాడు. ఈ సినిమా కూడా బ్రహ్మాండమైన హిట్టును సాధించింది. ఆ సినిమాలో దివ్య భారతి హీరోయిన్ గా నటించడం జరిగింది. ఆ సమయంలోనే దివ్యభారతి చనిపోయింది. ఇక సినిమాలో దివ్యభారతి లాగానే ఉన్న రంభను తీసుకొని దివ్యభారతి క్యారెక్టర్ ను పూర్తి చేశారు.

తెలుగు, తమిళ, మలయాళం లోనే కాకుండా హిందీలో కూడా నటించి పర్వాలేదనిపించుకున్నాడు ప్రశాంత్. అతను హిందీలో అనుఖా, ప్రేమయుద్, ఐ లవ్ యు వంటి చిత్రాల్లో నటించి అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇలా మంచి స్థానంలో దూసుకుపోయిన ప్రశాంత్ కెరియర్ ఒక్కసారిగా దిగజారిపోయింది. దీనికి కారణం ఆయన తండ్రి అని తెలుస్తోంది. ప్రశాంత్ తండ్రి తీసుకునే నిర్ణయాలతో నిర్మాతలు ప్రశాంత్ కు అవకాశాలు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారట. పారితోషికం విషయంలో కూడా ప్రశాంత్ తండ్రి అయిన త్యాగరాజన్ తన ఏకపక్ష నిర్ణయాలతో ప్రశాంత్ మనుగడను సినిమా ఇండస్ట్రీలో ప్రశ్నార్థకంగా మార్చివేశాడు.

ప్రశాంత్ సినిమా హిట్ అయితే చాలు రెమ్యునరేషన్ ను భారీగా పెంచేవాడట అతని తండ్రి. దీంతో నిర్మాతలు ప్రశాంత్ కు ఆఫర్ ఇవ్వడానికి వెనుకాడారు. తర్వాత ఓ ధనవంతురాలిన అమ్మాయిని ఇచ్చి వివాహం జరిగింది. అప్పటికి కూడా అతను తన తండ్రి వైపే ఉండటంతో భార్య కూడా అసహనానికి గురైంది. ఒక దశలో ఆమె తండ్రి కావాలా..? నేనా..? అనే ప్రశ్నను కూడా అడిగిందట. అప్పుడు కూడా ప్రశాంత్ తండ్రి వైపే ఉండడంతో ఆమె అతడిని వదిలేసి వెళ్లిపోయింది. ఇలా ప్రశాంత్ జీవితం అస్థిరంగా మారడానికి ఆయన తండ్రి కారణమని అందరికీ తెలుసు. తండ్రులు పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతారని విన్నాం. కానీ ఇలా పాడు చేస్తారనేది మాత్రం ఎక్కడ కనిపించలేదు.

రీసెంట్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవతారం ఎత్తిన ప్రశాంత్ తెలుగులో రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమాలో కీలక పాత్రలో కనిపించడం జరిగింది. ఇలా ఇంపార్టెంట్ రోల్స్ కూడా చేయడానికి వెనకాడ లేదు ప్రశాంత్. అయితే మంచి అవకాశాల కోసం చూస్తున్నాడు. టు తెలుగులో కూడా ఆఫర్ల కోసం ఎదురు చూస్తున్నాడు ప్రశాంత్. దీపమున్నప్పుడే చక్కబెట్టుకోవాలంటారు. అవకాశాలు ఉన్నప్పుడే అందిపుచ్చుకోవాలి. అంతేకానీ మన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే మొదటికి మోసం వస్తుంది.
తండ్రి చేసిన పొరపాట్లు ఇప్పుడు లాటరీ కొడుతున్నాడు. ఆ రోజుల్లో తండ్రి నిర్ణయాలతో అవకాశాలు రాకుండా పోయి కష్టాల పాలయ్యాడు.