ప్రభాస్ మొహమాటపడ్డాడా.? ఎందుకు మొహం చాటేస్తున్నట్టు.?

బ్యాక్ టు బ్యాక్ పెయిల్యూర్స్ నేపథ్యంలో ప్రభాస్ తన తదుపరి సినిమా ప్రమోషన్ల విషయంలో కాస్త జాగ్రత్త పడుతున్నట్లే కనిపిస్తోంది. ప్రభాస్ ఎంత జాగ్రత్త పడుతున్నా, హైప్ మాత్రం అనూహ్యమైన రీతిలో క్రియేట్ అవుతూనే వుంది ‘సలార్’ మీద.!

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్, శృతిహాసన్, పృధ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్‌లో ‘సలార్’ తెరకెక్కింది.. విడుదలకు సిద్ధమైపోయింది కూడా. ఈ సినిమాకి ప్రభాస్ ఒక్కడే స్టార్ కాదు.. మరో ఇద్దరు స్టార్స్ వున్నారు. ఓ స్టార్ నటుడు, నిర్మాత, దర్శకుడు పృధ్వీరాజ్ సుకుమారన్ అయితే, ఇంకొకరు దర్శకుడు ప్రశాంత్ నీల్.

‘కేజీఎఫ్’ ప్రాజెక్టుతో దేశం దృష్టిని తనవైపుకు తిప్పకున్నాడు ప్రశాంత్ నీల్. పృధ్వీరాజ్ సుకుమారన్ అయితే, బాలీవుడ్ ప్రేక్షకులకీ సుపరిచితుడే. మలయాళంలో అయితే సూపర్ స్టార్ అనదగ్గ స్థాయి వున్నోడు.

‘సలార్’ విడుదలకు సిద్ధమయినా, ప్రమోషన్స్ పెద్దగా జోరందుకోలేదు. ఇది ప్రభాస్ మొహాటం వల్ల జరిగింది తప్ప, మొహం చాటేయడం వల్ల కాదన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.

హైప్ పెరిగిపోతే, అంచనాల్ని అందుకోవడం కష్టం.. అని ప్రభాస్ తన సన్నిహితులతో చెబుతున్నాడట. అయితే, ఇన్‌సైడ్ సోర్సెస్ నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే, ‘సలార్’ అంతకు మించి.. అనే స్థాయిలో వుండబోతోందని తెలుస్తోంది.